అయ్యప్పకి అందాల రాముడి ఇరుముడి చెల్లింపు

ఇలాంటి సమయంలో సెలబ్రెటీలు వెళ్లినా కూడా ఇదే పరిస్థితి అనే విషయం తెల్సిందే.

Update: 2024-01-06 10:35 GMT

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు హాజరు అయ్యారు.. ఇంకా హాజరు అవుతూనే ఉన్నారు. దర్శనం కోసం ఏకంగా 15 నుంచి 24 గంటల వరకు సమయం పడుతుంది.

ఇలాంటి సమయంలో సెలబ్రెటీలు వెళ్లినా కూడా ఇదే పరిస్థితి అనే విషయం తెల్సిందే. అయినా కూడా తెలుగు హీరో కమ్‌ కమెడియన్ అయిన సునీల్ తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని ఇరుముడి చెల్లించారు.

కేరళలో ఉన్న అత్యంత రద్దీ మధ్య సునీల్‌ తన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. చాలా గంటలు వెయిట్‌ చేసి మరీ సునీల్‌ స్వామి వారిని దర్శించుకుని తన ఇరుముడిని సమర్పించారట.

ఇక సునీల్‌ సినిమాల విషయానికి వస్తే వరుసగా విలన్‌ గా నటిస్తూ దూసుకు పోతున్నాడు. హీరోగా ఆఫర్లు పెద్దగా రాకపోవడంతో చిన్న చిన్న సినిమాలు మానేసి పెద్ద సినిమాల్లో విలన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పుష్ప లో విలన్‌ గా నటించాడు. తెలుగులోనే కాకుండా తమిళ్‌ లో స్టార్‌ హీరోల సినిమా ల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News