సౌత్ హీరోల‌తో ధావ‌న్ బోయ్ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డా?

సీక్వెల్‌గా కాదు.. పాత్ర ఆధారిత ఫ్రాంచైజీగా మారుతుంద‌ని తెలిపారు.

Update: 2024-09-11 01:30 GMT

వ‌రుణ్ ధావ‌న్ న‌టించిన తాజా సినిమా 'బేబీ జాన్' 25 డిసెంబర్ 2024న విడుదల కానుంది. ఎ. కాళీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేష్ - వామికా గబ్బి క‌థానాయిక‌లుగా న‌టించారు. ఇటీవలి ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే వరుణ్ ధావన్ మునుపెన్నడూ చూడని నటనను ప్రదర్శించాడని, బేబీ జాన్ అందరి మనసులను చెదరగొడుతుందని పేర్కొన్నారు.

ఈ చిత్రం ఫ్రాంచైజీగా మారే అవకాశం ఉందని ఆమె వెల్లడించింది. సీక్వెల్‌గా కాదు.. పాత్ర ఆధారిత ఫ్రాంచైజీగా మారుతుంద‌ని తెలిపారు. 1నవంబర్ 2024న విడుదలవుతున్న సింగ‌మ్ ఎగైన్ ప్రింట్‌లకు బేబీ జాన్ ప్ర‌చార చిత్రాన్ని జోడిస్తార‌ని జ్యోతి దేశ్‌పాండే ధృవీకరించారు. అట్లీ - జియో స్టూడియోస్ సమర్పకులుగా ఏ ఫర్ యాపిల్ స్టూడియోస్ - సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

బాలీవుడ్ యువ‌హీరో వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా మార్కెట్ ని ఏలాల‌ని క‌ల‌లు గంటున్నాడు. అయితే ఇంత‌కుముందు అత‌డు చేసిన ప్ర‌య‌త్నం అంతంత మాత్రం ఫ‌లితాన్నే ఇచ్చింది. మునుముందు అత‌డు ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాలు, సౌత్ డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. కానీ దానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సౌత్ - నార్త్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ల ట్రెండ్ ఊపందుకుంది. ఇదే హుషారులో వ‌రుణ్ ధావ‌న్ తెలుగు, త‌మిళ హీరోల‌తో క‌లిసి న‌టిస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News