టాలీవుడ్ లో న‌యా వార‌సురాళ్లు!

ఇక న‌ట‌సింహ బాల‌కృష్ణ చిన్న కుమార్తే తేజ‌స్వీ కూడా నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తుంది.

Update: 2024-09-08 13:30 GMT

టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ హ‌వా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. తండ్రుల వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోల‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే అదే వార‌స‌త్వాన్ని అందుకుని న‌టీమ‌ణులుగా మాత్రం రాణించ‌డం లేదు. న‌ట‌న‌కంటే నిర్మాణ రంగంలో రాణించ‌డానికి ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే స్టార్ ప్రొడ్యూస‌ర్ అశ్వీని ద‌త్ వార‌స‌త్వాన్ని కుమార్తెలు స్వ‌ప్నా ద‌త్, ప్రియాంక ద‌త్ నిర్మాత‌లుగా కొన సాగిస్తున్నారు.

'క‌ల్కి 2898' విజ‌యంతో పాన్ ఇండియాలో ద‌త్ కుమార్తెలిద్ద‌రి మంచి గుర్తింపు ద‌క్కింది. అంత‌కు ముందు 'సావిత్రి', 'ఎన్టీఆర్' బ‌యోపిక్స్ లాంటివి నిర్మించిన చ‌రిత్ర వాళ్ల సొంతం. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని ప్ర‌యోగాలు ఈ అక్కా-చెల్లి చేయ‌డం ఖాయం. అలాగే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వార‌త‌స‌త్వాన్ని కొన‌సా గించ‌డానికి నిర‌హారిక కూడా ఎంట్రీ ఇచ్చింది. న‌టిగా ఇప్ప‌టికే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసింది.

కానీ త‌న‌ని తాను పూర్తి స్థాయి న‌టిగా ఆవిష్క‌రించుకోలేదు. అయితే నిర్మాతగా మాత్రం పూర్తి స్వేచ్ఛ‌గా పనిచేస్తుంది. ఓటీటీ రిలీజ్ లు..థియేట‌ర్ రిలీజ్ ల్ని బాగానే నిర్మిస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ఎంతో అనుభ‌వం సంపాదించింది. ఇప్పుడు గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అనే బ్యాన‌ర్ స్థాపించి తొలి సినిమా తండ్రితోనే నిర్మించ‌డానికి రెడీ అవుతుంది.

త్వ‌ర‌లోనే ఆవివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి. ఇక న‌ట‌సింహ బాల‌కృష్ణ చిన్న కుమార్తే తేజ‌స్వీ కూడా నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తుంది. లెజెండ్ ప్రొడ‌క్ష‌న్స్ పై త‌మ్ముడు మోక్ష‌జ్ఞ చిత్రాన్ని తానే స్వ‌యంగా నిర్మిస్తుంది. పెద్ద కుమార్తె బ్రాహ్మాణి ఇత‌ర బిజినెస్ ల్లో ఉంటే తేజ‌స్వీని బాల‌య్య నిర్మాత‌గా ఇండ‌స్ట్రీకి తీసుకొ స్తున్నారు.

Tags:    

Similar News