బాల‌య్య గారు 60 ఏళ్ల వ‌యసులోనూ అదే దూకుడు!

సినీ స్వర్ణోత్సవం జరుపుకొంటున్న నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు.

Update: 2024-09-02 04:56 GMT

హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియంలో 'బాలయ్య' పేరిట సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు హాజ‌ర‌య్యారు. సెల‌బ్రిటీల రాక‌తో వేడుక క‌ళ‌క‌ళ‌లాడుతుంది. అయితే ఈవేడుక‌లో ఏపీ సీఎం నారా చాంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి లోకేష్ లు ఏపీలో భారీ వ‌ర్షాల కార‌ణంగా హాజ‌రు కాలేక‌పోయారు. దీనికి సంబంధించి చంద్ర‌బాబు నాయుడు ఓ ట్వీట్ కూడా చేసారు.

'సినీ స్వర్ణోత్సవం జరుపుకొంటున్న నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాద్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలి’ అని అన్నారు.

అలాగే ఎంపీ భ‌ర‌త్ మాట్లాడుతూ, 'ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదల వల్ల చంద్ర బాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. బాలయ్య గారు 50 ఏళ్లు సినిమాలు చేసి కూడా ఇంకా ఇలా ఉన్నారు అంటే గ్రేట్. ఆయన ఈ వయసులో కూడా దూకేస్తూ ఉంటారు. అది బాలయ్య గారి ధైర్యం. నట, సేవ, రాజకీయం మూడు బ్యాలెన్స్ చేయడం చాల కష్టం. కానీ ఆయన చేస్తున్నారు. 50 సంవత్సరాలగా బాలయ్య గారిని అభిమానులు గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఆయనకు అల్లుడు అవ్వ‌డం అదృష్టంగా భావిస్తున్నా' అన్నారు.


న‌టుడు సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, ' బాల‌య్య బాబు గారికి కలిసిన 5-6 సార్లు కూడా నేను చూసినది ఏంటి అంటే? బాలయ్య గారు ఎవరిని అయినా నిజాయితీగా ఉంటే ఇష్టపడతారు. మీ అనుభవం అంతా లేదు నా వయసు. మీరు నాకు ఇన్స్పిరేషన్' అన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ, ' బాలయ్య గారు చాల సరదా మనిషి. 50 ఏళ్ల ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది' అన్నారు. న‌టుడు అడివి శేష్ మాట్లాడుతూ, ' చిన్నప్పుడు మీ పాటలకు డాన్స్ లు చేసే వాళ్ళం. ఈరోజు మీ గురించి ఇలా మాట్లాడ‌టం సంతోషంగా ఉంది' అని అన్నారు.

Tags:    

Similar News