'విశ్వంభ‌ర‌'లో చిరంజీవి ఆట మొద‌లైంది!

అగ్ని గోళం..కారు మ‌బ్బుల మ‌ధ్య చిరంజీవి మాయా లోకంలోకి అడుగు పెడుతున్న పోస్ట‌ర్ ని ఆవిష్క‌రించి విష‌యాన్ని చెప్పేసారు.

Update: 2024-02-02 05:49 GMT

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం 'విశ్వంభ‌ర` షూటింగ్ షురూ చేసారా? నేటి నుంచి రెగ్యుల‌ర్ గా సెట్స్ కి వెళ్ల‌బోతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. దానికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రిలీజ్ చేసింది. మెగాస్టార్ జాయిన్స్ అంటూ విశ్వంభ‌ర కొత్త పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. అగ్ని గోళం..కారు మ‌బ్బుల మ‌ధ్య చిరంజీవి మాయా లోకంలోకి అడుగు పెడుతున్న పోస్ట‌ర్ ని ఆవిష్క‌రించి విష‌యాన్ని చెప్పేసారు.


దీంతో నేటి నుంచి చిరంజీవి సెట్స్ కి హాజ‌రు కానున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో కొన్ని భారీ సెట్లు సిద్దం చేసి పెట్టారు. చిరంజీవి స‌హా ప్ర‌ధాన తార‌గ‌ణంపై కీల‌క సన్నివేశాలు చిత్రీరించాల్సిన నేప‌థ్యంలో కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఏకంగా 13 ర‌కాల సెట్లు సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది. సోషియా ఫాంట‌సీ చిత్రం కావ‌డంతో మేజ‌ర్ పార్ట్ షూటింగ్ అంతా అక్క‌డే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది.

ఈ సెట్స్ వ‌దిలి బ‌య‌ట లొకేష‌న్లో షూటింగ్ ఉండ‌క‌పోవ‌చ్చు. అందుకే చిరంజీవి ఎంట్రీ కంటే ముందే మారుడుమిల్లి అట‌వీ ప్రాంతంలో తొలి షెడ్యూల్ ముగించారు. వాటిలో చిరంజీవి పాల్గొన‌లేదు. అవ‌న్నీ చిరంజీవి లేని స‌న్నివేశాల‌ని తెలుస్తోంది. తొలుత చిరు కూడా కొన్ని స‌న్నివేశాల కోసం మారుడుమిల్లి షూట్ లో పాల్గొన్నార‌ని ప్ర‌చారం సాగింది గానీ అదంతా అవాస్త‌వ‌మ‌ని తెలుస్తోంది.

చిరంజీవి జాయిన్స్ అని పోస్ట‌ర్ వేయ‌డంతోనే ఈ విష‌యాన్ని క‌న్ప‌మ్ చేయాల్సి వ‌స్తోంది. సినిమాలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబు పాత్ర పోషిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే లీకులందుతున్నాయి. ఆ పాత్ర‌కి జోడీగా ఇద్ద‌రు నాయిక‌లు ఉంటార‌ని తెలిసింది. ఆ మూడు పాత్ర‌ల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివే శాలు...న‌వ్వు తెప్పించే స‌న్నివేశా లుంటాయ‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని 'బింబిసార` ఫేం మ‌ల్లిడి వశిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News