పల్లెటూరి అందమంటే ఎంత ఇష్టమో..

త్వరలోనే పక్కా పల్లెటూరి ఆడపిల్లలా.. మాస్ పాత్రలో కనువిందు చేయనుంది. త్వరలోనే ఆమె ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2023-11-01 15:37 GMT

సినిమాలో హీరోయిన్ పాత్రేంటి?.. హీరోతో లవ్​.. గ్లామర్ ట్రీట్​.. మధ్యలో ఓ మూడు నాలుగు పాటల్లో డ్యాన్స్​లు, క్లైమాక్స్​లో ఓ ఎమోషన్ సీన్.. ఇదంతా ఒకప్పుడు ఫార్ములా. ఇప్పుడంతా మారిపోతోంది. వారి పాత్రలకు కథలో బలం పెరుగుతోంది. ముఖానికి రంగులు అద్దుకోవడం, గ్లామర్​గా హీరోలు పక్కన మెరవడం కాస్త తగ్గించి కంటెంట్​ నచ్చితే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో, అవసరమైతే డీగ్లామర్​గా, ఊరమాస్​గా కనిపిస్తున్నారు.

యంగ్ హీరోయిన్స్ టు సీనియర్ కథానాయికలు అంతా ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. సమంత, ఐశ్వర్య రాజేశ్, కీర్తి సురేశ్, తాప్సీ, అనుష్క సహా పలువురు ముద్దుగుమ్మలు ఈ లిస్ట్​లో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కూడా వచ్చి చేరిపోయింది.

త్వరలోనే పక్కా పల్లెటూరి ఆడపిల్లలా.. మాస్ పాత్రలో కనువిందు చేయనుంది. త్వరలోనే ఆమె ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజైన లుక్​లో జాన్వీ పల్లటూరి యువతిగా లంగా ఓణిలో మరింత అందంగా కనిపించి ఆకట్టుకుంది.

నిజానికి గత కొద్ది కాలంలో తెలుగులో హీరోయిన్లను పల్లెటూరి అమ్మాయిలుగా పక్కా మాస్​గా చూపించింది సుకుమార్. ​ముందుగా రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలంలో హీరోయిన్​గా సమంత నటించింది. అప్పటి వరకు గ్లామర్​ రోల్స్​కే పరిమితమైన సామ్.. ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా డీ గ్లామర్ రోల్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత పుష్పలో రష్మిక మందన్న పాత్ర కూడా పాలు అమ్ముకునే యువతిగా మాస్​గా చూపించాడు సుకుమార్.

త్వరలోనే రానున్న మంగళవారం చిత్రంలోనూ పాయల్ రాజ్​పుత్ రోల్​ ఇలానే కనిపించనుంది. ఇంకా గతంలో కీర్తిసురేశ్​ సాయి కానిదన్, దసరా.. కొండపొలంలో రకుల్, ఓదల రైల్వే స్టేషన్​లో హెబ్బా పటేల్, నారప్పలో ప్రియమణి, వరల్డ్ ఫేమస్ లవర్​లో ఐశ్వర్య రాజేశ్.. ఇలా చాలా మందే పల్లెటూరి అమ్మాయిలుగా, ఊరమాస్​గా, నటనకు ప్రాధాన్యమున్న, కథలో కీలక పాత్ర పోషించే పాత్రలలో నటించి ప్రేక్షకుల మనసు దోచారు.

Tags:    

Similar News