దేవర బిజినెస్ టార్గెట్ గట్టిగానే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది

Update: 2024-01-02 03:58 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మూవీలో తారక్ కి జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ప్రతినాయకుడిగా సైఫ్ ఆలీఖాన్ కనిపించబోతున్నారు. మూవీ కోసం ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

తారక్ ఫారిన్ నుంచి రాగానే మరల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారంట. త్వరలో మూవీ షూటింగ్ కి ప్యాకప్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా నమ్మకంగా ఉంది. సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

కొత్త సంవత్సరం సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సముద్రంలో పడవ మీద నిలబడి గంబీరంగా చూస్తోన్న తారక్ లుక్ లో మంచి ఇంటెన్స్ కనిపిస్తోంది. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 145 కోట్ల బిజినెస్ చేస్తుందని నిర్మాతలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఆంధ్రాలో 65 కోట్లు, సీడెడ్ లో 22 కోట్లు, తెలంగాణలో 55 కోట్ల బిజినెస్ ని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి చేరువ కావడంతో విఫలం అవుతున్నాయి. సలార్ మూవీ కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఆడియన్స్ క్రమంగా తగ్గుతూ ఉండటంతో అంత వరకు రీచ్ కాకపోవచ్చు అనుకుంటున్నారు.

ఎలాంటి పరిస్థితిలో దేవర సినిమాపై డిస్టిబ్యూటర్స్ రిస్క్ చేయడానికి ఇష్టపడతారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే మాత్రం అమాంతం అతని క్రేజ్ పెరిగిపోతుంది. హిందీలోకి వార్ 2 మూవీతో అడుగుపెడుతున్నాడు కాబట్టి నార్త్ లో కూడా దేవర సినిమాపై బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News