దిశా పాప దశ తిరిగినట్టేనా?

'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ దిశా పటానీ.

Update: 2024-07-03 04:22 GMT

'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ దిశా పటానీ. 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడంతో, తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది. హిందీ సినిమాలపై దృష్టి పెట్టిన ఈ బ్యూటీ.. అక్కడ పలు క్రేజీ చిత్రాల్లో నటించే అవకాశం అందుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది.

హిందీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు జోడీగా నటించిన 'ఎంఎస్ ధోని - అన్ టోల్డ్ స్టోరీ' సినిమా దిశా పటానీకి ఫస్ట్ సక్సెస్ రుచి చూపించింది. ఆ వెంటనే 'కుంఫు యోగా' అనే చైనీస్ సినిమాలో జాకీ చాన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంది. 'బాఘీ 2' హిట్టయినా.. 'మలంగ్', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్' లాంటి చిత్రాలు అమ్మడిని నిరాశ పరిచాయి. మధ్యలో కొన్ని స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ చేసినా లాభం లేకుండా పోయింది. చివరగా దిశా దశ మార్చేస్తుందని ఆశలు పెట్టుకున్న 'యోధ' సినిమా గట్టి దెబ్బకొట్టింది.

ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో, ఇక హాట్ బ్యూటీ కెరీర్ కష్టమే అనుకున్నారంతా. అలాంటి టైంలోనే 'కల్కి 2898 AD' సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది దిశా పటానీ. దాదాపు 9 ఏళ్ల తర్వాత తెలుగులో చేసిన రీఎంట్రీ ప్రాజెక్ట్ ఇది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీ, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ వసూళ్లతో బాక్సాఫీసు దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. దీంతో దిశా మరోసారి వార్తల్లో నిలిచింది.

Read more!

'కల్కి' చిత్రంలో ప్రభాస్ ప్రేయసిగా రాక్సీ పాత్రలో నటించిన దిశా పటాని. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ, ఉన్నంతలోనే తన ఉనికిని చాటుకుంది. స్క్రీన్ మీద ఎంతో అందంగా కనిపించి సైన్స్ ఫిక్షన్ మూవీకి కూసింత గ్లామర్ అద్దింది. ప్రభాస్ తో కలిసి చేసిన రొమాంటిక్ యాక్షన్ సీన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. 'టా టక్కర' సాంగ్ లో కాంప్లెక్స్ లో అందాలు ఆరబోసి టాలీవుడ్ జనాల దృష్టిలో పడింది.

ఏదేమైనా 'కల్కి 2898 ఏడీ' చిత్రం దిశాకి మంచి కంబ్యాక్ అనే అనుకోవాలి. సినిమా విజయంలో ఆమె వాటా ఎంతనేది పక్కన పెడితే.. దీని పుణ్యాన అమ్మడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే దర్శనమిస్తున్నాయి. దీని తర్వాత 'లోఫర్' బ్యూటీకి తెలుగులో మరిన్ని అవకాశాలు గ్యారంటీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కల్కి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న దిశాకి, టాలీవుడ్ లో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.

ఇదిలా ఉంటే దిశా పటానీ ప్రస్తుతం 'వెల్ కమ్ టూ ది జంగిల్' సినిమాలో నటిస్తోంది. అలానే 'కంగువ' చిత్రంలో తమిళ హీరో సూర్యకు జోడీగా నటిస్తోంది. ఇది ఆమెకు కోలీవుడ్ డెబ్యూ. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో, 3D & IMAX ఫార్మాట్‌లలో విడుదల కానుంది.

Tags:    

Similar News

eac