డబుల్ ఇస్మార్ట్.. రిలీజ్ అయ్యే వరకు ఓ యుద్ధమే..

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని.. డబుల్ ఇస్మార్ట్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-08 02:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని.. డబుల్ ఇస్మార్ట్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌ పై ఛార్మితో క‌లిసి స్వ‌యంగా నిర్మిస్తున్నారు కూడా. ఇప్పటికే పూరి, రామ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ కంప్లీట్ అయిపోయింది.

డ‌బుల్ ఇస్మార్ట్ చిత్రంలో కావ్య థాప‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ ద‌త్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ప్రేక్షకులకు డబుల్‌ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని మేకర్స్ చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. చెప్పిన డేట్ కే తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా.. థియేట్రికల్ రైట్స్ ను సేల్ చేసేందుకు సిద్ధమయ్యారు. నార్త్ కాకుండా దేశంలో మిగతా అన్ని ఏరియాల కలిపి మేకర్స్ రూ.63 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

అయితే పూరి జగన్నాథ్ చివరి సినిమా లైగర్ సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ మూవీ.. తీవ్రంగా నిరాశపరిచింది. పెద్ద ఎత్తున నష్టాలు కూడా వచ్చాయి. బయ్యర్ల ఫోన్ కాల్స్ కు పూరి స్పందించకపోవడంతో అప్పుడు పెద్ద వివాదమే నడిచింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు పూరీ జగన్నాథ్. ఆ తర్వాత లైగర్ విషయంపై అంతా కాస్త సైలెంట్ గా ఉన్నా.. లెక్కలు ఇప్పటికీ సెటిల్ కాలేదు.

ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. అప్పుడు వివాదం.. మళ్లీ ఇప్పుడు బయటకు వస్తుందేమోనని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ డీల్స్ కు లైగర్ వివాదం స్పీడ్ బ్రేకర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు ముందే బకాయిలన్నీ క్లియర్ చేసుకోవాలి. ఈ విషయంలో పూరి టీమ్ కాస్త క్లారిటీతోనే ఉన్నా.. ఈ సినిమా రిలీజ్ వరకు ఓ యుద్ధమే చేయాల్సి వస్తుందేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. బజ్ పెరగాలి అంటే వచ్చే అప్డేట్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక పర్ఫెక్ఫ్ గా రిలీక్ చేయాలి అంటే ఇలాంటి టెన్షన్స్ అయితే ఉండకూడదు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News