రామ్‌ చరణ్‌ ని పెళ్లి చేసుకోవాలని ఉందట...!

మంత్‌ ఆఫ్‌ మధు సినిమాలో స్వాతి కంటే కూడా ఎక్కువగా ఈమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు.

Update: 2023-12-06 05:38 GMT

వైజాగ్‌ అమ్మాయి జ్ఞానేశ్వరి గురించి ప్రస్తుతం తెలుగు సోషల్‌ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ అమ్మాయి నటించిన మంత్ ఆఫ్‌ మధు సినిమా మరియు దూత వెబ్‌ సిరీస్ లు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ రెంటి లో కూడా జ్ఞానేశ్వరి చక్కని నటనతో మెప్పించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

మంత్‌ ఆఫ్‌ మధు సినిమాలో స్వాతి కంటే కూడా ఎక్కువగా ఈమె ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ గా మంచి భవిష్యత్తు ఈమెకు ఉంది అంటూ తన అందంతో కూడా మెప్పించింది. తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల స్టార్స్ నుంచి ఈమెకు పిలుపు వస్తుందా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

ఆ విషయం పక్కన పెడితే దూత వెబ్‌ సిరీస్‌ లో యూట్యూబర్‌ గా ఈమె కనబర్చిన నటనకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పాత్ర మధ్య లో చనిపోయినా కూడా ఉన్నంత సేపు మంచి నటన కనబర్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జ్ఞానేశ్వరి తనకు రామ్‌ చరణ్‌ పై ఉన్న అభిమానంను మరోసారి చాటుకుంది.

రామ్‌ చరణ్ పై ఉన్న అభిమానంతో చాలా కాలం నుంచి ఒక ఫోటో బుక్ ను తయారు చేసుకున్నాను. ఇప్పటికి కూడా అది నా వద్ద ఉందని జ్ఞానేశ్వరి చెప్పుకొచ్చింది. బుక్స్ నిండా చరణ్‌ ఫోటోలు ఉంటాయని పేర్కొంది. ఇక చరణ్ ను ఇప్పుడు కలిస్తే ఏం అడుగుతారు అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది.

పదేళ్ల క్రితం చరణ్ ని కలిసి ఉంటే నన్ను పెళ్లి చేసుకోమని అడిగేదాన్ని... ఇప్పుడు మాత్రం ఆయనతో కలిసి నటించాలని అడుగుతాను అంటూ తన అభిమానంను వెళ్లడించింది. మరి జ్ఞానేశ్వరికి చరణ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కేనా చూడాలి.

Tags:    

Similar News