స్టోరీ రూమర్లకు చెక్.. తుపాకీ తో హను ఎక్స్ క్లూజివ్!

కొత్త భామ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా శనివారం నాడు పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ప్రారంభమైంది.

Update: 2024-08-20 12:55 GMT

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కొత్త భామ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా శనివారం నాడు పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ప్రారంభమైంది. అదే సమయంలో సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. క్లాప్ బోర్ట్ పై మూడు ఇంట్రెస్టింగ్ విషయాలను మెన్షన్ చేశారు.

కోల్ కతా హవ్‌ డా బ్రిడ్జ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పతాకం, హైదరాబాద్‌ చార్మినార్‌ ను చూపించారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా చిత్రం సాగుతుందన్నట్లు తెలుస్తోంది. 1940స్ బ్యాక్ డ్రాప్ లో మూవీని తీసుకురాన్నున్నట్లు కాన్సెప్ట్‌ పోస్టర్‌లో వివరించారు మేకర్స్.

అదే సమయంలో సినిమా స్టోరీకి సంబంధించి రీసెంట్ గా రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. నానితో చేయాలనుకున్న కథను ఇప్పుడు ప్రభాస్‌ తో హను రాఘవపూడి చేస్తున్నట్లు టాక్ వినిపించింది. అందుకు ఎగ్జాంపుల్ గా ఓ వీడియో కూడా వైరల్ అయింది. దీంతో తుపాకీ ప్రభాస్ సినిమా స్టోరీపై వస్తున్న రూమర్ల విషయంలో డైరెక్టర్ హను రాఘవపూడిని సంప్రదించింది. ఆయనతో నేరుగా కాల్ లో మాట్లాడి రూమర్లపై క్లారిటీ తీసుకొచ్చింది.

తాను అనేక వార్ బేస్డ్ కథలు రాసుకున్నానని తుపాకీ తో హను రాఘవపూడి తెలిపారు. నానికి నెరేట్ చేసిన స్టోరీ వేరు అని, ప్రభాస్ తో చేస్తున్న సినిమా కథ వేరే అని హను చెప్పారు. ఆ రెండు కథలకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా వేర్వేరు స్టోరీలని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో సాగే కథలు తన వద్ద చాలా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ప్రభాస్, హను మూవీ కథపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. తుపాకీ నేరుగా ఆయనకు సంప్రదించడంతో స్పష్టత వచ్చేసింది.

అయితే ప్రభాస్, హను మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఇప్పుడు స్టోరీపై ఉన్న రూమర్స్ క్లియర్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News