ట్రోల్స్ చేసినోల్లే సారీ చెప్పేలా చేశాడు..!

ఐతే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో తన మీద వచ్చిన విపరీతమైన ట్రోల్స్ గురించి చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.

Update: 2024-08-08 13:49 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ తను తీసే సినిమాలతోనే కాదు చేసే కామెంట్స్ కూడా అదిరిపోతాయి. సినిమాలో తన హీరో ఎలా ఉంటాడో దాదాపు బయట తను అంతేలా కనిపిస్తాడు. అంటే ఏదైనా విషయంపై స్పందించే తీరు.. తనను టార్గెట్ చేసిన వారిని రివర్స్ కౌంటర్ ఇచ్చే పద్ధతి ఇదంతా హరీష్ శంకర్ ఖలేజాని తెలియచేస్తుంటాయి. లేటెస్ట్ గా ఆయన మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా భాగ్య శ్రీ హీరోయిన్ గా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరో రవితేజ కన్నా ఎక్కువ హరీష్ శంకర్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఐతే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో తన మీద వచ్చిన విపరీతమైన ట్రోల్స్ గురించి చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తేరి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ మెంట్ టైం లో తన మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయని. దాదాపు 2 లక్షల 68 వేల నెగిటివ్ ట్వీట్స్ వచ్చాయని.. వాళ్లంతా రీమేక్ ఆపేయాలని ట్రోల్స్ చేశారు. ఇలా ఒక డైరెక్టర్ కు ఈ రేంజ్ ట్రోల్స్ ఎక్కడ జరగలేదు.

ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ అయ్యాక మళ్లీ అందరు సారీ చెప్పారని అన్నారు హరీష్ శంకర్. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీస్ పై ఎలా పడితే అలా రియాక్ట్ అవ్వడం నెటిజన్లకు అలవాటుగా మారింది. ఐతే పవర్ స్టార్ తో రీమేక్ సినిమా అనగానే ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఎటాక్ చేశారు. కానీ టీజర్ రిలీజ్ తర్వాత వాళ్లంతా మళ్లీ హరీష్ శంకర్ ని పొగిడారు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు హరీష్ శంకర్.

రిలీజ్ అవుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా మాస్ రాజా ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తుందని అన్నారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ లో రవితేజ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. సినిమాలో డైలాగ్స్ గుర్తుండిపోతాయని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉందని పవన్ కూడా సినిమా పూర్తి చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News