సామ్.. మళ్ళీ ఇప్పటికి కుదిరిందా?
గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్, వెబ్సిరీస్లతో బిజీగా ఉన్న సమంత, తాజాగా మళ్లీ టాలీవుడ్లో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతోందని సమాచారం.;
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు హిట్ సినిమాల తర్వాత కూడా ఇష్టమైన కథల కోసం ఓపికగా వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారిలో సమంత ఒకరు. గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్, వెబ్సిరీస్లతో బిజీగా ఉన్న సమంత, తాజాగా మళ్లీ టాలీవుడ్లో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతోందని సమాచారం. 2023లో వచ్చిన ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె నుంచి ఏ తెలుగు సినిమా రాలేదు. లేడీ ఓరియెంటెడ్ కథలు వచ్చినా కూడా ఆమె పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
అయితే ఇప్పుడు ఆమె ఓ కొత్త ప్రాజెక్ట్తో రీ ఎంట్రీకి సిద్ధమవుతోందని టాక్. ఈసారి సమంత కథ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ 'త్రలలా మూవింగ్ పిక్చర్స్'ను ప్రారంభించిన సమంత, తొలి ప్రాజెక్ట్గా ‘మా ఇంటి బంగారం’ పేరుతో ఓ సినిమాను ప్రకటించింది. కానీ ఇందులో ఆమె నటిస్తుందా లేదా కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే తీసుకుంటుందా అన్నదానిపై స్పష్టత లేదు.
అయితే తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన కథకు మాత్రం ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. నందిని రెడ్డితో సమంతకు ఇది మూడో సినిమా. ఇంతకుముందు జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. నందిని రెడ్డి గత కొన్ని రోజులుగా సమంత కోసం ఓ స్పెషల్ స్క్రిప్ట్ను డెవలప్ చేస్తోందని, చివరికి అది సమంతను మెప్పించిందని అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం.
ఇది పూర్తిగా వైవిధ్యమైన కథ అని, ఇప్పటివరకు సమంత చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని టాక్. ఈ సినిమాను సమంత తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా నిర్మిస్తుందా లేక మరొక పెద్ద నిర్మాణ సంస్థతో కలసి తీస్తుందా? అన్నది ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగులో సినిమాలు తగ్గించిన తర్వాత సమంత హిందీ ప్రాజెక్ట్స్పై ఎక్కువగా దృష్టి సారించింది. ‘ది ఫ్యామిలీ మాన్ 2’ తర్వాత బాలీవుడ్కు డోర్స్ ఓపెన్ చేసుకున్న సమంత, ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ: ది బ్లడీ కింగ్డమ్’ అనే సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ ప్రాజెక్ట్లో ఆమె ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి నటిస్తోంది. హిందీలో తన సత్తా చూపించేందుకు ప్రయత్నిస్తున్నా, ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మిస్ అవుతున్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగులో ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫ్యాన్స్ను ఖుషి కలిగించే విషయం. సమంత ఎప్పుడు స్ట్రాంగ్ పాత్రలను ఎంచుకుంటుందనే విషయం తెలిసిందే. నందిని రెడ్డితో గతంలో ఆమె చేసిన ‘ఓ బేబీ’ కూడా బిగ్ హిట్ కావడంతో, ఇప్పుడు ఈ కొత్త సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.