మృణాల్ ఠాకూర్.. మరో జాక్ పాట్ కొట్టేసింది!

అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న సౌత్ హీరోయిన్లలో ఒకరిగా అమ్మడు చక్రం తిప్పుతోంది.

Update: 2024-07-02 13:21 GMT

అందాల భామ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. మొదట బాలీవుడ్ సైడ్ ఎక్కువగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం నాన్ స్టాప్ గా సౌత్ లో అవకాశాలు అందుకుంటోంది. అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న సౌత్ హీరోయిన్లలో ఒకరిగా అమ్మడు చక్రం తిప్పుతోంది. 'సీతా రామం' మరియు 'హాయ్ నాన్నా' వంటి అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

ప్రస్తుతం ఆమెకు దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో కూడా బిజీ అవుతోంది. తాజాగా, మృణాల్ ఠాకూర్ అజయ్ దేవగన్ మరియు సంజయ్ దత్ హీరోలుగా నటించే 'సన్ ఆఫ్ సర్దార్ 2' చిత్రంలో హీరోయిన్‌గా సైన్ చేసింది. ఈ సినిమా 2012 లో వచ్చిన 'సన్ ఆఫ్ సర్దార్'కి(మర్యాద రామన్న రీమేక్) సీక్వెల్ కాకుండా కొత్త కథతో రూపొందిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ స్కాట్లాండ్‌లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. వచ్చే నెల నుండి అక్కడ 50 రోజుల పాటు సినిమా షూటింగ్ కొనసాగుతుంది. స్కాట్లాండ్‌లోని గ్లెన్‌కో, గ్లెన్‌ఫిన్నాన్, కుల్రోస్ ప్యాలెస్, డౌన్ క్యాసిల్, ప్రెస్టన్ మిల్, ఫాల్క్లాండ్ ప్యాలెస్ వంటి ప్రదేశాలలో ప్రధానంగా చిత్రీకరణ జరుగుతుంది. సంజయ్ దత్ పాత్రలో ప్రతినాయకత్వం లేకుండా ఉంటుందని సమాచారం. 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా వినోదాత్మకంగా ఉండబోతుందని చిత్ర బృందం చెబుతోంది.

Read more!

ఇక ఈ చిత్రానికి విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహిస్తుండగా, అజయ్ దేవగన్ ప్రస్తుతం 'సింఘం అగైన్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దీపావళి సీజన్‌లో విడుదల కానుంది. అలాగే అజయ్ దేవగన్ 'దే దే ప్యార్ దే 2' చిత్రం కూడా చేస్తున్నాడు, ఇది మొత్తం లండన్‌లో చిత్రీకరించబడుతోంది. 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.

ఇక తెలుగులో రీసెంట్ గా మృణాల్ ఠాగూర్ కల్కి 2898AD సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. ఒక చిన్న పాత్రలో కనిపించినప్పటికి అమ్మడు తన నటనతో మంచి ఏమోషన్ ను హైలెట్ చేసింది. ఇక ఇంతకుముందు విజయ్ దేవరకొండ తో చేసిన ఫ్యామిలీ స్టార్ అంతగా ఆడలేదు. ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్ అనే మరో సినిమా చేస్తోంది. ఇక తెలుగులో మరికొన్ని చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News

eac