తొలి హార్ట్ బ్రేక్ గురించి ఓపెనైన జాన్వీ

''నేను జీవితంలో ఒక్కసారి మాత్రమే హృదయ విదారక స‌న్నివేశాన్ని అనుభవించాను.. కానీ అదే వ్యక్తి తిరిగి వచ్చి నా హృదయాన్ని ఒకచోటికి చేర్చాడు.

Update: 2024-07-22 04:15 GMT

నా గుండెను గాయ‌ప‌రిచి వెళ్లిపోయిన అతడే తిరిగి నాకోసం వ‌చ్చాడు! అని బ‌హిరంగంగా వ్యాఖ్యానించింది జాన్వీ క‌పూర్. శ్రీ‌దేవి న‌టవార‌సురాలిగా సినీరంగ ప్ర‌వేశం చేసిన జాన్వీ, త‌న‌దైన అందం, న‌ట ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంటూ అటు ఉత్త‌రాది, ఇటు ద‌క్షిణాది రెండు చోట్లా దూసుకెళుతోంది. ఇప్పుడు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. ఇద్ద‌రు పెద్ద స్టార్ల‌తో సౌత్ లో ఘ‌న‌మైన ఎంట్రీ ఇస్తోంది.

మ‌రోవైపు వ్య‌క్తిగ‌త జీవితంలో త‌న చెలికాడి గురించి కూడా జాన్వీ ఏదీ దాచుకోకుండా ఓపెన‌వుతూనే ఉంది. జాన్వీ-శిఖ‌ర్ ప‌హారియా డేటింగ్ గురించి చాలా కాలంగా చ‌ర్చ సాగుతోంది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో ఈ ఇద్ద‌రూ జంట‌గా కనిపించిన తర్వాత మళ్లీ అవే పుకార్లు తెరపైకి వచ్చాయి. అంబానీల పెళ్లిలో ఈ జంట మైమ‌మ‌రిచి డ్యాన్సులు చేస్తూ క‌నిపించారు. అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో జాన్వీ తన మొదటి బ్రేకప్‌ను ఎలా ఎదుర్కొంది? వివాదం త‌ర్వాత ప‌రిణామాల గురించి ఓపెన్ గా మాట్లాడింది. శిఖ‌ర్ తో బ్రేక‌ప్ అయినా కానీ అది త‌న‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని కూడా జాన్వీ వెల్ల‌డించింది. హాటర్‌ఫ్లైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ ఇలా చెప్పింది.''నేను జీవితంలో ఒక్కసారి మాత్రమే హృదయ విదారక స‌న్నివేశాన్ని అనుభవించాను.. కానీ అదే వ్యక్తి తిరిగి వచ్చి నా హృదయాన్ని ఒకచోటికి చేర్చాడు. కాబట్టి అంతా బాగానే ఉంది'' అని జాన్వీ వెల్ల‌డించింది.

జాన్వీ తన ప్రారంభ PMS మూడ్ స్వింగ్స్ గురించి వ్యాఖ్యానిస్తూ.. అవి తన ప్రియుడితో తన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేశాయనే దాని గురించి కూడా మాట్లాడింది. ''నాకు పీరియడ్స్ వచ్చిన రెండు ఆరంభ‌ సంవత్సరాలలో ప్రతి నెలా నేను అత‌డి నుంచి విడిపోయాను. మొదటి రెండు మూడు నెలలు షాక్‌లో ఉన్నా. ఆ తర్వాత 'అవును ఓకే' అనుకుని రెండు రోజుల తర్వాత ఏడుస్తూ సారీ అంటూ అతడి దగ్గరకు వెళ్లాను. నా మెదడు ఎందుకు ఇలా పనిచేస్తుందో నాకు అర్థం కాలేదు. ఇది చాలా విపరీతమైనది'' అని తెలిపింది.

జాన్వీ కపూర్ తదుపరి చిత్రం ఉలజ్ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. లండన్ రాయబార కార్యాలయంలో స్పైగా ప్ర‌వేశించాక కుట్రలో చిక్కుకున్న యువ దౌత్యవేత్తగా జాన్వీ నటించింది. జాన్వీ కపూర్ తన పాత్ర గురించి మాట్లాడుతూ .. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనద‌ని, మొదటిసారిగా ఒక దౌత్యవేత్తగా సవాలుతో కూడిన పాత్రను పోషించాను అని జాన్వీ తెలిపింది. సుధాన్షు సరియాతో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతడు సుహానా పాత్రను నా స్వ‌యం హద్దులు దాటేలా చేసాడు. నేను ఒక ప్రామాణికమైన నటనను అందించడానికి నాకు సహాయపడిన పాత్ర ఇది'' అని తెలిపారు.

ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్, మీయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా మరియు జితేంద్ర జోషి కూడా నటించారు. పర్వీజ్ షేక్, సుధాన్షు సరియా దీనిని రచించారు. ఉలజ్ 2 ఆగస్ట్ 2024న థియేటర్లలోకి రానుంది.

Tags:    

Similar News