పిక్‌ టాక్ : బ్లాక్ డ్రెస్ లో నిగనిగలాడుతున్న అందం

దేవర సినిమా ఇంకా విడుదల అవ్వక ముందే రామ్‌ చరణ్ కి జోడీగా బుచ్చి బాబు దర్శకత్వంలో ఈ అమ్మడు సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

Update: 2024-06-03 12:11 GMT

సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో కూడా కోట్లాది మంది అభిమానుల యొక్క అభిమానం దక్కించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా హీరోయిన్స్‌ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ముఖ్యంగా జాన్వీ కపూర్‌ రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా బాలీవుడ్‌ లో రూపొందిన తాజా చిత్రం 'మిస్టర్ అండ్‌ మిసెస్ మహీ' సినిమా విడుదల నేపథ్యంలో అందాల ఫోటో షూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియాలో పదే పదే వార్తల్లో కనిపిస్తున్న జాన్వీ కపూర్‌ తాజాగా బ్లాక్ డ్రెస్‌ లో ఆకట్టుకుంది.

స్లీవ్‌ లెస్ బ్లాక్‌ డ్రెస్‌ లో థైస్ అందాలను చూపిస్తూ బ్యాక్ అందం చూపిస్తూ జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్థాయి అందాల ఆరబోత చేయడం వల్లే ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో హిట్స్ లేకున్నా కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

తెలుగు లో ఈ అమ్మడు ఎన్టీఆర్‌ కు జోడీగా దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. దేవర సినిమా ఇంకా విడుదల అవ్వక ముందే రామ్‌ చరణ్ కి జోడీగా బుచ్చి బాబు దర్శకత్వంలో ఈ అమ్మడు సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News