రజినీకాంత్ సినిమా.. ఇది మరీ దారుణం..

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్ హీరోగా అతని కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్.

Update: 2024-08-28 10:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్ హీరోగా అతని కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా క్లిక్కవ్వలేదు. ఎక్కువగా రజినీకాంత్ పోస్టర్స్ తోనే సినిమాని ప్రమోట్ చేశారు. అలాగే ఆయన ఇమేజ్ మీదనే సినిమాకి మార్కెట్ కూడా అయ్యింది.

భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. రజినీకాంత్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాలలో ఒకటిగా లాల్ సలామ్ నిలిచింది. అయితే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకి సంబందించిన అవుట్ ఫుట్ ఉన్న హార్డ్ డిస్క్ లు పోయాయని, అందుకే అనుకున్నట్లు మూవీ రాలేదనే విషయాన్ని ఐశ్వర్య రజినీకాంత్ తరువాత చెప్పారు.

అది ఎంత వరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు లాల్ సలామ్ డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేదు. ఎవరు ఈ మూవీ రైట్స్ తీసుకోవడానికి ముందుకి రాలేదు. దీంతో అలా హోల్డ్ లో ఉండిపోయింది. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నుంచి వచ్చిన సినిమా అయిన కూడా ఓటీటీ సంస్థలు లాల్ సలామ్ సినిమాని కొనడానికి ఆసక్తి చూపించలేదు. దీనిని బట్టి ఈ సినిమా నిర్మాతని ఏ స్థాయిలో ఇంపాక్ట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే లాల్ సలామ్ సినిమా ఫైనల్ గా సన్ నెక్స్ట్ లో సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతోందని సోషల్ మీడియాలో ఒక పోస్టర్ సర్క్యులేట్ అయ్యింది. దీంతో ఫైనల్ గా ఓటీటీలో సినిమాని చూడబోతున్నామని సూపర్ స్టార్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ సంతోషం వారికి ఎంతో సేపు లేదు. ఓటీటీ రిలీజ్ అప్డేట్ పై వచ్చిన పోస్టర్ సన్ నెక్స్ట్ నుంచి లేదంటే లైకా ప్రొడక్షన్స్ నుంచి రాలేదంట.

ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలుస్తోంది. సినిమా రిలీజ్ పై ఓటీటీ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫ్యాన్స్ కావాలని అలా పోస్టర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ ఫేక్ అనే విషయం బయటకొచ్చాక చాలా మంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే లాల్ సలామ్ మూవీ ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ కాకపోయిన అక్టోబర్ 10న రజినీకాంత్ కొత్త సినిమా వేట్టయాన్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకులలో ఉంది.

Tags:    

Similar News