టాలీవుడ్ లో ర‌ష్యా భామ!

ఆ బాలుడి చుట్టూనే ఆ క‌థ ఉండ‌టంతో తప్ప‌లేదు. వీళ్లు గాకీ విదేశీ భామ‌ల కేట‌గిరికి స‌న్నిలియోన్ లాంటి వాళ్లు వ‌స్తారు.

Update: 2024-07-03 13:30 GMT

టాలీవుడ్ లో విదేశీ భామ‌లు న‌టించ‌డం అన్న‌ది చాలా రేర్. రాజ‌మౌళి, సింగీతం శ్రీనివాస‌రావు లాంటి స్టార్ డైరెక్ట‌ర్లు విదేశీ న‌టుల్ని తీసుకొచ్చి సామ‌సాలు చేయాలి త‌ప్ప‌! మిగ‌తా వారెవ్వ‌రూ వాళ్ల జోలికి వెళ్ల‌రు. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో బ్రిట‌న్ బ్యూటీ ఒలివియో మోరీస్, అలీస‌న్ డొడ్డి లాంటి వారిని త‌న క‌థ‌లో పాత్ర‌ల‌కు అవ‌స‌రం మేర జ‌క్క‌న్న తీసుకొచ్చారు. అంతకు ముందు సింగీతం `వెల్క‌మ్ ఒబామా` సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర కోసం రిచెల్ అనే ఓ బాలుడిని తీసుకొచ్చాడు.

ఆ బాలుడి చుట్టూనే ఆ క‌థ ఉండ‌టంతో తప్ప‌లేదు. వీళ్లు గాకీ విదేశీ భామ‌ల కేట‌గిరికి స‌న్నిలియోన్ లాంటి వాళ్లు వ‌స్తారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో ప‌నిచేసే విదేశీయులున్నా? వాళ్లంతా లెక్క‌లోకి రానివారే. వీళ్లంద‌రికంటే ముందు `తీన్మార్` సినిమాలో ర‌ష్యాకి చెందిన అన్నాలెజ్నీవా కూడా న‌టించారు. అందులో ఆమె ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా ఓ పాత్ర చేసారు. ప్ర‌స్తుతం ఆమె ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య అన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా అదే ర‌ష్యా నుంచి మ‌రో భామ టాలీవుడ్ కి దిగుమ‌తి అయింది. లియుబా పామ్ అనే అమ్మ‌డు ఎంట్రీ ఇచ్చింది. నిన్ను వ‌ద‌ల‌ను అనే హార‌ర్ సినిమాలో న‌టిస్తుంది. షిరాజ్ మోహ‌దీ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ కుల్ల‌ర్ నిర్మిస్తోన్న చిత్ర‌మిది. ఇందులో లియూబా ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆమె ర‌ష్యాలోనటే కాదు. సింగ‌ర్ గా, నిర్మాత‌గా రాణిస్తుంది. వెబ్ సిరీస్ ల‌కు రైట‌ర్ గానూ ఈ అమ్మ‌డు ప‌నిచేసింది.

మొత్తానికి టాలీవుడ్ క్రేజ్ ర‌ష్యా బ్యూటీల‌కు బాగానే ఎక్కేసింద‌ని తెలుస్తుంది. అన్నాలెజ్నీవా త‌ర్వాత టాలీవుడ్ లో లియూబా కూడా బాగా ఫేమ‌స్ అవ్వాల‌ని నెటి జ‌నులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ లో రైట‌ర్ల‌కు మంచి డిమాండ్ ఉంది. లియూబా ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చేసినా స‌క్సెస్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News

eac