నెక్స్ట్ లైన్ లో మహేష్, పవన్, చరణ్..!

కథను పొడిగించి రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్ టీ ఆర్, అల్లు అర్జున్ లు మాత్రమే ఇలా రెండు భాగాలుగా సినిమాలు చేశారు.

Update: 2024-10-12 06:58 GMT

స్టార్ సినిమా అంటే చాలు బడ్జెట్ కి తగినట్టుగానే రెండు భాగాలుగా మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తో మొదలైన ఈ పంథా దేవర వరకు కొనసాగింది. బాహుబలి 1, 2 ఆ తర్వాత కె.జి.ఎఫ్, పుష్ప ఇప్పుడు దేవర ఇలా అన్ని సినిమాలు ఒకే తరహాలో వస్తున్నాయి. కథను పొడిగించి రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్ టీ ఆర్, అల్లు అర్జున్ లు మాత్రమే ఇలా రెండు భాగాలుగా సినిమాలు చేశారు. ఇప్పుడు పవన్ కూడా అదే పంథాల్ వీరమల్లు సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.

ఐతే ఈ లిస్ట్ లో చేరాల్సిన ఇంకా ఇద్దరు స్టార్స్ ఉన్నారు. వారిలో ఒకరు మహేష్, మరొకరు చరణ్ కనిపిస్తున్నారు. మహేష్ తో రాజమౌళి చేసే సినిమా కచ్చితంగా ఒక భాగంగా వచ్చే ఛాన్స్ లేదు. ఈ సినిమాను రాజమౌళి ఎన్ని భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇక చరణ్ కూడా ఇప్పటివరకు రెండు భాగాల సినిమాలు చేయలేదు. ఒకవేళ బుచ్చి బాబుతో చేసే సినిమా ఏమైనా అలాంటి ప్లాన్ ఉంటుందేమో చూడాలి.

బాహుబలి తో మొదలైన ఈ రెండు భాగాల సెంటిమెంట్ కలిసి వస్తుండటం వల్ల కొనసాగిస్తున్నారు. ఐతే మధ్యలో రవితేజ ఈగల్ అలాంటి ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఈగల్ 2 ప్రయత్నాలు దాదాపు ఆగిపోయినట్టే అని చెప్పొచ్చు. ఈగల్ సినిమా ముందే రెండు భాగాలని ప్రకటించలేదు. థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు.

కేవలం చరణ్, మహేష్ లు మాత్రమే ఈ రెండు భాగాల సినిమాలు చేయట్లేదు. మహేష్ జక్కన్న మూవీ ఎలాగు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. చరణ్ ఆర్సీ 16 సినిమా ప్లానింగ్ కూడా వేరే లెవెల్ లో ఉంది. మరి ఈ సినిమాలు నిజంగానే రెండు పార్టులుగా చేస్తారా లేదా అన్నది చూడాలి. మహేష్, చరణ్ కూడా ఇలా తమ సినిమాను రెండు ముక్కలుగా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.

Tags:    

Similar News