కన్నప్ప షూటింగ్ లో ప్రమాదం.. ఏం జరిగిందంటే..

మంచు విష్ణు ఈసారి కన్నప్ప సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నాడు.

Update: 2023-10-29 11:00 GMT

మంచు విష్ణు ఈసారి కన్నప్ప సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఎవరు కూడా ట్రై చేయని కన్నప్ప కథను అతను తీసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా నటిస్తూ ఉండడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

ముఖ్యంగా ప్రభాస్ శివుడి పాత్రలో నటించబోతున్నాడు. అలాగే నయనతార పార్వతిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది. అయితే హఠాత్తుగా జరిగిన ఒక ప్రమాదంలో మంచు విష్ణు కి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉండగా మంచు విష్ణు పై ఒక్కసారిగా గాలిలో ఉన్న డ్రోన్ కెమెరా మీద పడినప్పుడుగా తెలుస్తోంది. అయితే విష్ణు చేతులకు కాస్త గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హీరో విష్ణు బాగానే ఉన్నారు అని సమాచారం.

ఆయనకు కేవలం చిన్నపాటి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇక వెంటనే ఆపేసిన చిత్ర యూనిట్ సభ్యులు మంచి విష్ణుని హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. గతంలో కూడా విష్ణు కొన్ని యాక్షన్ సన్నివేశాలలో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన సోదరుడు మంచు మనోజ్ కూడా కొన్ని సినిమాలలో రియల్ స్టంట్ చేసి దెబ్బలు తగిలించుకున్నారు.

ఇక మంచు విష్ణు ఈసారి కన్నప్ప సినిమా కోసం కూడా ఈ విధంగా ప్రమాదానికి గురవడంతో ప్రాజెక్టుపై వారు ఎంతగా ప్రాణం పెట్టి పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక కన్నప్ప సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో వెండి తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ముకేశ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం ఇస్తున్నాడు. ఇక ప్రముఖ టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్ర కోసం అడగగానే వెంటనే ఒప్పుకున్నాడు. ఇప్పుడు అదే విషయం ఈ సినిమాకు కావలసినంత బజ్ క్రియేట్ చేసింది. మరి రాబోయే రోజుల్లో సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News