మత్తు వదలరా-2 ట్రైలర్.. ఎలా ఉందంటే?

బయటకు రారా నీతి మాలిన కుక్క అనే బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత శ్రీసింహ, సత్యను రివీల్ చేశారు మేకర్స్.

Update: 2024-09-08 06:43 GMT

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి కుమారుడు శ్రీసింహా, కమెడియన్ సత్య లీడ్ రోల్స్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా 2. 2019లో థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అయిన మత్తు వదలరాకు సీక్వెల్ గా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న మత్తు వదలరా-2.. క్రైమ్ కామెడీ జోనర్ లో ఆడియన్స్ ను అలరించనుంది. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, సాంగ్స్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 13వ తేదీన మత్తు వదలరా సీక్వెల్ రిలీజ్ కానున్నట్లు ఇటీవల అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. తాజాగా మూవీ ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు.

బయటకు రారా నీతి మాలిన కుక్క అనే బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత శ్రీసింహ, సత్యను రివీల్ చేశారు మేకర్స్. హెచ్ఈ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిద్దరూ కిడ్నాపర్‌ల నుంచి డబ్బులు తీసుకుంటారు. అనుకోకుండా వారిలో ఒకరు చనిపోతారు. దీంతో చాలా భయపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైంది? అనేది మొత్తం సినిమాగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

అయితే సీక్వెల్ కోసం క్రేజీ కాన్సెప్ట్ ను రితేష్ సెలెక్ట్ చేసుకున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ఆయన రాసుకున్న ప్రతి రోల్ కూడా సినిమాకు కీలకంగా అనిపిస్తోంది. స్టోరీ స్పీడ్ గా ఉంటూ.. క్రేజీగా అలరిస్తోంది. నెరేషన్ స్పెషల్ అట్రాక్టివ్ గా నిలుస్తుంది. డ్రగ్స్ అంశం యూనిక్ ట్విస్ట్ గా అనిపిస్తోంది. శ్రీసింహా, సత్య రోల్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఫరియా, సునీల్, అజయ్ పాత్రలు.. మూవీకి మరింత అసెట్ గా మారినట్లు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ ఫన్ ఎలిమెంట్స్ తో పాటు క్రైమ్ అంశాలతో అందరినీ ఆకట్టుకుంటోంది.

సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, సంగీత దర్శకుడు కాల భైరవ, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఆర్.. ముగ్గురూ కలిసి తమ వర్క్ తో ట్రైలర్ ను ఆకర్షణీయంగా మార్చారు. మూవీని కూడా అంతే రీతిలో ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న మత్తు వదలరా-2 ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News