మత్తు వదలరా 2… మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

శ్రీ సింహ, సత్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘మత్తు వదలరా 2’ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో దూసుకుపోతోంది.

Update: 2024-09-16 10:40 GMT

శ్రీ సింహ, సత్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘మత్తు వదలరా 2’ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఫుల్ ఫన్ రైడ్ తో ‘మత్తు వదలరా’కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ భారీ కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది. కంటెంట్ లో దమ్ముంటే చిన్న, పెద్ద సినిమా అనే తేడాని ఆడియన్స్ చూడరని ‘మత్తు వదలరా 2’ మరోసారి ప్రూవ్ చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెకింది. ఇక మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా 16.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోందని తెలిపారు.

ఇప్పటి వరకు యూఎస్ఏ లో 615K డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్స్ 1 మిలియన్ క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. చిన్న బడ్జెట్ చిత్రంగా వచ్చిన ఈ మూవీ అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకుందని మేకర్స్ తెలిపారు. సెప్టెంబర్ 27న ‘దేవర’ రిలీజ్ వరకు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అడ్డంకి లేదు.

ఈ నేపథ్యంలో 30 కోట్లకి పైగా కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో ‘మత్తు వదలరా 2’ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ‘మత్తు వదలరా 2’ సినిమాకి రెగ్యులర్ ఆడియన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే సెలబ్రెటీలు కూడా ‘మత్తు వదలరా 2’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ ఇదేనని అంటున్నారు.

సత్య సినిమాలో ఆధ్యంతం నవ్విస్తూనే ఉన్నాడనే మాట వినిపిస్తోంది. మొత్తానికి శ్రీసింహ ‘మత్తు వదలరా 2’తో హీరోగా సెకండ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఈ సినిమాతో అతని ఇమేజ్ కూడా పెరిగిందనే మాట వినిపిస్తోంది. అలాగే ఫరియా అబ్దుల్లా కూడా ‘జాతిరత్నాలు’ తర్వాత కెరియర్ రెండో హిట్ ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు రితేష్ రానా వరుస అవకాశాలు అందుకోవడం గ్యారెంటీ అని భావిస్తున్నారు. ఓవరాల్ గా ‘మత్తు వదలరా 2’ మూవీ యాక్టర్స్ తో పాటు టెక్నీషియన్స్ కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.

Tags:    

Similar News