తొలిసారి సీక్వెల్‌ ప్లాన్ చేసిన నాని

తెలుగులో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే నేచురల్ యాక్టింగ్‌తో స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

Update: 2024-10-21 10:48 GMT

తెలుగులో ఎంతో మంది హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే నేచురల్ యాక్టింగ్‌తో స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. అంతలా ఇతడు చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో ఆల్‌రౌండ్ టాలెంట్‌తో దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటడడంతో పాటు తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు.

ఇటీవలి కాలంలో హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘HIT3’ సినిమాను చేస్తున్నాడు. దీనితో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. ‘దసరా’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. వీటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్లేలా ప్లాన్లు చేసుకుంటున్నాడు.

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న నాని ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును కూడా చేయబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా అతడు గతంలో నటించి హిట్‌ను అందుకున్న ‘పిల్ల జమీందార్’కు సీక్వెల్‌గా రూపొందనుందని తెలిసింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత డీఎస్ రావు ఇటీవల జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో మీడియా ముఖంగా వెల్లడించారు.

తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ ‘మీరు తీసిన పిల్ల జమీందార్ సినిమాలో నేను నటించలేకపోయాను. కానీ, ఈ సినిమా సీక్వెల్‌లో నాకు ఆఫర్ ఇవ్వండి’ అని అడిగాడు. దీంతో నిర్మాత డీఎస్ రావు ‘పిల్ల జమీందార్ సీక్వెల్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తాము. ఇందులో కచ్చితంగా నీకు ఆఫర్ ఇస్తాను’ అని చెప్పారు. ఇలా ఈ మూవీపై ప్రకటన చేశారాయన.

నేచురల్ స్టార్ నాని ఇప్పటి వరకూ 30 సినిమాల వరకూ చేశాడు. కానీ, అందులో ఒక్కటంటే ఒక్క సీక్వెల్ కూడా లేదు. ఇప్పుడు ‘పిల్ల జమీందార్’ సినిమాకు కొనసాగింపుగా ప్రాజెక్టు చేస్తే నాని కెరీర్‌లోనే అది ఫస్ట్ సీక్వెల్ కానుంది. నిర్మాత దీనిపై ప్రకటన చేసినా.. దీనికి దర్శకత్వంలో వహించేది ఎవరు అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఇప్పుడు ఈ సీక్వెల్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.

ఇక, 2011లో వచ్చిన ‘పిల్ల జమీందార్’ సినిమాను జీ అశోక్ అనే దర్శకుడు తెరకెక్కించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంతోనే నానికి నటుడిగా మంచి పేరు కూడా వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ ప్రకటన అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది.

Tags:    

Similar News