ఆరేళ్లు.. నలుగురు స్టార్లు.. నీల్ లైనప్ వేరే లెవెల్!

పాన్ ఇండియా లెవెల్ లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.

Update: 2024-10-13 21:30 GMT

కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు కేజీఎఫ్ మూవీ టైమ్ లో మోత మోగిన విషయం తెలిసిందే. స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో అలరించాయి. బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కేజీఎఫ్-2 అయితే ఏకంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ప్రశాంత్ నీల్.. నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.

ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు ప్రశాంత్ నీల్. సినిమాలో ఆయన ఇచ్చిన ఎలివేషన్లు ఓ రేంజ్ లో అందరినీ అలరించాయి. రిపీట్ మోడ్ లో సినిమా చూసి మరీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు నీల్ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. మరో ఐదారేళ్లపాటు స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్నారు. అందుకు గాను ఇప్పటికే ఆయన లాక్ చేసుకున్నారు. మరి నీల్ లైనప్ లో సినిమాలు ఏంటంటే?

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నీల్. కొన్ని రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలు రాగా.. ఇంకా మొదలు కాలేదు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ తో ఉన్నారు నీల్. ఆ తర్వాత సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం కంప్లీట్ చేయనున్నారు. చిత్రీకరణకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన సలార్-2.. 2027 సమ్మర్ లో రానుందని టాక్.

కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్-3 కోసం కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ను ఇప్పటికే ఆయన రెడీ చేసుకున్నట్లు సమాచారం. డైలాగ్ వెర్షన్ ను కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే అందుకు నీల్ ఒక ఏడాది టైమ్ తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా మెగా హీరో రామ్ చరణ్, నీల్ కాంబోలో మూవీ ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని టాక్ వచ్చింది.

అటు రామ్ చరణ్.. ఇటు నీల్ లైనప్ దృష్ట్యా.. 2029 లేదా 2030లో ఆ సినిమా మొదలు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సలార్ కన్నా ముందే చరణ్, నీల్ కలిసి సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. 2021లో ప్రాజెక్ట్ ఓకే అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఐదారేళ్ల పాటు ప్రశాంత్ నీల్.. ఖాళీ లేకుండా వరుసగా స్టార్ హీరోలను ఫిక్స్ చేసుకున్నారు.

Tags:    

Similar News