కొత్త నేషనల్‌ క్రష్ వచ్చేసింది..!

మీర్జాపూర్ స్టార్ నేహా సర్గమ్‌ ను అభిమానులతో పాటు సోషల్‌ మీడియా జనాలు నేషనల్‌ క్రష్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Update: 2024-07-11 06:05 GMT

రష్మిక మందన్న తన అందం మరియు అభినయంతో యూత్‌ లో మంచి ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకుని నేషనల్‌ క్రష్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. పుష్ప మరియు యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌ గా రష్మిక మందన్న దూసుకు పోతుంది.

 

ఈ సమయంలో సోషల్ మీడియాలో కొత్త నేషనల్ క్రష్ పుట్టుకొచ్చింది. మీర్జాపూర్ స్టార్ నేహా సర్గమ్‌ ను అభిమానులతో పాటు సోషల్‌ మీడియా జనాలు నేషనల్‌ క్రష్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మిర్జాపూర్ సీజన్ 3 లో సలోని భాభి పాత్రలో నటించి మెప్పించిన ఈమెకు సోషల్‌ మీడియాలో ఓవర్ నైట్‌ క్రేజ్ దక్కింది.

 

భాభి అంటూ నేహా సర్గమ్‌ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తూ ఉన్నారు. నేషకల్‌ క్రష్ అంటూ ఫ్యాన్స్ మరియు నెటిజన్స్ తో పిలిపించుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు బాలీవుడ్‌ తో పాటు సౌత్ లో బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషణలు వస్తున్నాయి.

 

మిర్జాపూర్ సీజన్ 3 కి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన దక్కడం లేదు అనేది టాక్‌. అయితే అందులో నటించిన నేహా సర్గమ్‌ కి మాత్రం సిరీస్ కి మించిన పాపులారిటీ దక్కింది. నెట్టింట సలోని భాభి గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.

 

ముందు ముందు ఈమె బోల్డ్‌ కంటెంట్ వెబ్‌ సిరీస్‌ లకు మోస్ట్‌ వాంటెడ్‌ నటి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే సినిమాల్లో కూడా ఈమె ను రాబోయే రోజుల్లో ఎక్కువగా చూస్తామని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చి పోయిన ఈ అమ్మడు నేషనల్‌ క్రష్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

Tags:    

Similar News