ఫ్లాపిచ్చి డ‌బ్బు వృధా చేసాడు.. రాళ్ల‌తో కొట్టండి

అయితే ఆ సినిమాతో ద‌ర్శ‌కుడిగా అప‌ఖ్యాతి మొత్తానికి తాను బాధ్య‌త‌ల‌ను తీసుకున్నారు నిఖిల్.

Update: 2024-10-27 02:30 GMT

ఖిలాడీ అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా నిఖిల్ అద్వాణీ తెర‌కెక్కించిన 'చాందిని చౌక్ టు చైనా' సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా వ‌ల్ల పంపిణీదారుల‌కు న‌ష్టాలొచ్చాయి. అయితే ఆ సినిమాతో ద‌ర్శ‌కుడిగా అప‌ఖ్యాతి మొత్తానికి తాను బాధ్య‌త‌ల‌ను తీసుకున్నారు నిఖిల్.


ఇక త‌న కెరీర్ లో క‌ర‌ణ్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో సినిమాలు చేసాన‌ని, అయితే అక్క‌డ ఫ్లాపులొచ్చాక స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ త‌న‌కు వెన్నుద‌న్నుగా నిలిచి అవ‌కాశాలు క‌ల్పించార‌ని కూడా తెలిపాడు. అయితే చాందిని చౌక్ టు చైనా చిత్రం ఫెయిల‌య్యాక త‌న‌పై ప్ర‌జ‌లు చేసిన వ్యాఖ్య‌లు తీవ్రంగా బాధించాయ‌ని నిఖిల్ అద్వాణీ అన్నారు.

మ‌న డ‌బ్బులు వృధా చేసిన వ్య‌క్తి ఇల్లు ఇదే. అత‌డిని రాళ్ల‌తో కొట్టండి అని ఒక రిపోర్ట‌ర్ మా ఇంటి ముందు నిల‌బ‌డి రిపోర్ట్ చేసాడు. ఆ మాట‌లు న‌న్ను బాధించాయి అని నిఖిల్ అద్వాణీ అన్నారు. అక్ష‌య్ కుమార్ కి ఇటీవ‌ల ఫ్లాపులున్నా, అప్ప‌టికి కొన్ని వ‌రుస హిట్లు ఉన్నాయి. అయినా చాందిని చౌక్ టు చైనా ఫ్లాప‌వ్వ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

Tags:    

Similar News