పిక్ టాక్ : రాజాసాబ్‌ నవ్వులు ఎప్పటికీ..!

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని సమాచారం అందుతోంది.

Update: 2024-10-24 05:52 GMT

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో సినిమా కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి. అంచనాలను అందుకునే విధంగానే రాజాసాబ్‌ ను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తాజాగా విడుదల అయిన పోస్టర్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచడంతో పాటు, ప్రభాస్‌ని కొత్తగా చూడబోతున్నామనే నమ్మకంను ఫ్యాన్స్‌ కి కలిగించింది అనడంలో సందేహం లేదు.

నిన్న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో సోషల్‌ మీడియాలో ఆయనకు కోట్లాది మంది బర్త్‌ డే విశెష్‌ తెలియజేస్తూ ట్రెండ్‌ చేశారు. ఇక ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన మేకర్స్‌ నుంచి సైతం ప్రత్యేకమైన ఫోటోలు, పోస్ట్‌లతో బర్త్‌డే శుభాకాంక్షలు అందడం జరిగింది. రాజాసాబ్‌ సినిమాను నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సోషల్‌ మీడియా పేజ్‌ ల్లో పలు పోస్ట్‌ లు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా షేర్‌ చేయడం జరిగింది. అందులో ప్రభాస్‌, మారుతి కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మారుతి ఇంతగా నవ్వడం మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇంత నవ్వుకు కారణం ఏంటో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఫోటోతో పాటు హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌... మన నవ్వులు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి అన్నట్లుగా పోస్ట్‌ చేయడం జరిగింది. సినిమాపై నమ్మకంతో ఈ నవ్వులు కంటిన్యూ అవుతాయని దర్శకుడు మారుతి ఫోటోకి ట్యాగ్‌ ఇచ్చి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజాసాబ్‌ సినిమాను ఏ స్థాయిలో ప్రమోట్‌ చేయాలో అంతకు మించి అన్నట్లుగానే ప్రమోట్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా కాన్సెప్ట్‌ ఏంటి అనే విషయమై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ఓల్డ్‌ గెటప్ లో కనిపించడం వల్ల కథ విషయంలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సంజయ్ దత్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా కనిపిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్‌ ను వరుసగా సలార్‌, కల్కి సినిమాల్లో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో చూసిన ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కి కాస్త ఆట విడుపు అన్నట్లుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ పంథాలో చూపించేందుకు దర్శకుడు మారుతి ప్లాన్‌ చేశారు. ఒక వైపు భయపెడుతూనే మరో వైపు నవ్వించే విధంగా రాజాసాబ్‌ సినిమా ఉంటుందని మేకర్స్‌ అంటున్నారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ను, టీజర్‌ ను త్వరలోనే ప్రకటిస్తామని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మెంబర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమా కి రెడీ అవుతున్నాడు. మరో వైపు సలార్‌ 2 సినిమా షూటింగ్ కోసం డేట్లు ఇవ్వడం జరిగింది. ఆ రెండు సినిమాలకు డేట్లు ఇచ్చినా ఈ ఏడాదిలో రాజా సాబ్‌ సినిమాకు గుమ్మడి కాయ కొట్టడం పక్కా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News