రూ.100 కోట్ల స్కాం లో ప్రకాష్ రాజ్ ... ఈడీ తేల్చిందిదే!

అవును... ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో చిక్కుకున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ కు తాజాగా ఊరట లభించింది.

Update: 2023-12-16 05:36 GMT

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్న జ్యువెలర్స్ కంపెనీపై తమిళనాడు ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ చేసిన దర్యాప్తులో ప్రకాశ్ రాజ్ కి క్లీన్ చీట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు. దీంతో... ఈ కేసుకు సంబంధించిన వివరాలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.

అవును... ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో చిక్కుకున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ కు తాజాగా ఊరట లభించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జ్యువెలరీ గ్రూపుపై ఉన్న రూ.100 కోట్ల పోంజీ, మోసం కేసులో ప్రకాష్ రాజ్ పేరు నాడు ప్రముఖంగా వినిపించింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనకు సమన్లు జారీ చేసి విచారించింది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ లభించింది.

ఇందులో భాగంగా... మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ ప్రమేయం లేదని తేలిందని.. ఆయన ఆ గోల్డ్ సంస్థకు కేవలం బ్రాండ్‌ అంబాసిడర్‌ మాత్రమేనని తెలిపిందని తెలుస్తుంది. పోలీసుల ఫిర్యాదు మేరకు ప్రణవ్ జ్యువెలర్స్, ఇతరులు గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం పేరుతో అధిక లాభాలు వస్తాయని ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేశారని ఈడీ తెలిపింది.

అయితే కాల క్రమంలో... తమ డబ్బును పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వడంలో ప్రణవ్ జ్యువెలర్స్ విఫలమయ్యింది! దీంతో తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్‌ పై ఈడీ అధికారులు నవంబర్ 20న దాడులు నిర్వహించి రూ.23.70 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ జ్యువెలర్స్ కంపెనీకి జాతీయ అవార్డు గ్రహీత నటుడు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్!

ఈ సమయంలో ప్రకాష్ రాజ్ స్టేట్‌ మెంట్‌ ను రికార్డ్ చేయాలని ఈడీ కోరింది. కొన్ని ఉద్దేశపూర్వక చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయనను ప్రశ్నించాలని కోరుతూ.. ఈడీ గత నెలలో అతనికి సమన్లు జారీ చేసింది. ఈ సమయంలో తాజాగా ఆ జ్యూవెలరీ కంపెనీ మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ ప్రమేయం లేదని.. ఆయన ఆ సంస్థకు కేవలం బ్రాండ్‌ అంబాసిడర్‌ మాత్రమేనని తెలిపింది.

ఈ విషయాలను ఆన్ లైన్ వేదికగా పంచుకున్న ప్రకాష్ రాజ్... "తమిళం అర్థం కాని వారి కోసం.. తమిళనాడులోని ప్రణవ్ జ్యువెలర్స్ మోసంతో నటుడు ప్రకాష్ రాజ్‌ కు ఎలాంటి సంబంధం లేదని అధికారిక ప్రకటన వెలువడింది.. దీనికి సంబందించి నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. నన్ను నమ్మి ఎందరో ఆదరించారు.. సత్యమేవ జయతే" అని తెలిపారు.

Tags:    

Similar News