ర‌కుల్ గాలి మ‌ళ్లీ ఇటువైపు వీస్తుందేమి?

ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కెరీర్ కాస్త స్లో అయిన సంద‌ర్భంలో ఒక్క‌సారిగా బాలీవుడ్ కి షిప్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-07-03 23:30 GMT

ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కెరీర్ కాస్త స్లో అయిన సంద‌ర్భంలో ఒక్క‌సారిగా బాలీవుడ్ కి షిప్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి అక్క‌డి సినిమాలే చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల‌గా హిందీ ప‌రిశ్ర‌మ‌ని అంటిపెట్టుకునే ప‌నిచేస్తుంది. ఈ క్ర‌మంలో సౌత్ సినిమాల‌పై తన‌దైన శైలిలో విమ‌ర్శ‌లు సైతం చేసింది. త‌న లాంటి ప్ర‌తిభావంతుల‌కు పాన్ఇండియా సినిమాల్లో అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌నే అంశాన్ని లేవ‌నెత్తింది.

అయితే అప్ప‌టికే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఇండియ‌న్ -2` చిత్రంలో న‌టిస్తోంది. కానీ ఆ సినిమా షూట్ లో భాగంగా త‌న పార్టు షూటింగ్ డిలే అవుతుంది. దీంతో ఇది పాన్ ఇండియా సినిమా కాదా? సౌత్ సినిమా కాదా? అంటూ ర‌కుల్ పై నిప్పులు చెరిగిన త‌మిళ తంబీల వ‌ర్గం ఉంది. ఇదంతా ప‌క్క‌న‌బెడితే నాలుగేళ్ల‌గా హిందీ సినిమాలే చేస్తోంది. మ‌ధ్య‌లో కొన్ని త‌మిళ సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం ఇంకా లైన‌ప్ లో కొన్ని హిందీ సినిమాలున్నాయి.

Read more!

ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డి మ‌న‌సు తెలుగు సినిమాల వైపు మ‌ళ్లీన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో `ఆస్క్ మి ఎనీథింగ్` సెషన్‌ను హోస్ట్ చేసింది. అభిమానుల నుంచి మ‌ళ్లీ తెలుగు సినిమాలు చేయ‌రా? అన్న ప్ర‌శ్న వ్య‌క్త‌మైంది. `నా తెలుగు అభిమానులందరినీ నిజంగా మిస్ అవుతున్నాను. త్వరలో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. తెలుగు అభిమానులు న‌న్నోంతో ఆద‌రించారు.

తెలుగు మాట్లాడ‌గ‌ల‌ను. కానీ హిందీ కొచ్చిన త‌ర్వాత ఆ భాష మిస్ అవుతున్నాన‌నే బాధ నాలో ఉంది. త్వ‌ర‌లోనే తెలుగు సినిమా అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను` అంది. దీంతో ఛాన్స్ ఉండాలేగానీ ర‌కుల్ కంబ్యాక్ అవ్వ‌డానికి రెడీగా ఉంద‌ని అర్ద‌మ‌వుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా వైష్ణవ్ తేజ్ సరసన `కొండ పొలం` సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు.

Tags:    

Similar News

eac