RC 16: ఆ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే

Update: 2023-11-21 13:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత మొదలు కాబోతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ తేజ్ గతంలో ఇప్పుడు లేనంత డిఫరెంట్గా ఆ సినిమాలో కనిపించబోతున్నాడట. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక పీరియడ్ విలేజ్ డ్రామా అని తెలుస్తోంది.

పవర్ఫుల్ యాక్షన్ తో పాటు సినిమాలో చాలా ఎమోషన్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఎలాగైనా రాంచరణ్ తో తెరపైకి తీసుకురావాలి అని దర్శకుడు చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా కొనసాగుతోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ 2024 ఫిబ్రవరి లోపు పూర్తి చేసి వెంటనే రామ్ చరణ్ తేజ ఆ తరువాత బుచ్చిబాబు ప్రాజెక్టు ను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. మొదట్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఫిక్స్ అయిందని అన్నారు. ఆ తర్వాత మృనల్ ఠాగూర్ పేరు కూడా గట్టిగానే వినిపించింది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వారసురాలు రామ్ చరణ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతోంది అని కథనాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా అయితే ఫస్ట్ మొదటి ఆప్షన్ లో దర్శకుడు జాన్వీ పేరు అనుకున్నప్పటికీ ఆమె దేవర సినిమాకు అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇక ఆ తర్వాత ఎక్కువగా వైరల్ అయ్యింది మాత్రం సాయి పల్లవి పేరు.

దర్శకుడు ఆమె టాలెంట్ ను చూసి తీసుకోవాలని అనుకున్నప్పటికీ.. సినిమాలో కాస్త గ్లామర్ కూడా హైలెట్ అవ్వాలి అని మరొకవైపు నుంచి ఆలోచిస్తూన్నారని తెలుస్తోంది. అందుకే సాయి పల్లవి పేరు లిస్టులోకి వచ్చినప్పుడు ఇంకా ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం మరి కొంతమంది పేర్లు చర్చల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదని టాక్.

Tags:    

Similar News