రాజా రంగంలోకి దిగేది ఎప్పుడంటే?

మాస్ రాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా భాను భొగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న‌సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-23 05:45 GMT

మాస్ రాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా భాను భొగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న‌సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలోనే ప్ర‌మాద‌వ‌శాత్త ర‌వితేజ తీవ్ర గాయాల‌పాలైన సంగ‌తి విధితమే. దీంతో షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్ర‌స్తుతం ర‌వితేజ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఈనెల‌ఖరుక‌ల్లా ఆయ‌న పూర్తిగా క‌లుకుంటార‌ని స‌మాచారం .

ఈనేప‌థ్యంలో కొత్త షెడ్యూల్ వ‌చ్చే నెల మిడ్ నుంచి షూటింగ్ పున ప్రారంభించాల‌ని యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది. ర‌వితేజ‌కి సంబంధించిన కంటున్యూటీ స‌న్నివేశాలు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి కొత్త షెడ్యూల్ లో పూర్తిగా కొత్త స‌న్నివేశాల‌తోనే మొద‌లు పెట్టాల‌ని టీమ్ బావిస్తోందిట‌. ఇప్ప‌టికే షూటింగ్ 40 శాతం పూర్త‌యింది. బ్యాలెన్స్ 60 శాతం కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌ని టీమ్ భావిస్తోంది.

ఇంత వ‌ర‌కూ టీమ్ ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్ల‌లేదు. షూట్ అంతా స్థానికంగానే పూర్తి చేసారు. ఓ లాంగ్ షెడ్యూల్ విదేశాల్లోనూ ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. అలాగే ర‌వితేజ పాత్ర‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీక్ అయింది. ఇందులో ర‌వితేజ ఆర్పీఎఫ్ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆ పాత్ర ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ పాత్ర నేప‌థ్యంలో ఇండియ‌న్ రైల్వే కి ఈ క‌థ‌కి సంబంధం ముడిప‌డి ఉంద‌నే అంశం చ‌ర్చ‌కొస్తుంది.

ఈ సినిమా విజ‌యం ర‌వితేజ‌కి కీల‌కం. ఇప్ప‌టికే ఆయ‌న న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ఫెయిలవుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమాలేవి స‌రైన ఫ‌లితాలు సాధించ‌డం లేదు. అయినా రాజాకి అవ‌కాశాల ప‌రంగా కొద‌వ‌లేదు. ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా కొత్త సినిమా అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కొన్ని ప్రాజెక్ట్ లో లైన‌ప్ లో పెడుతున్నారు.

Tags:    

Similar News