300 ఇనిస్ప్రేష‌న్ తో మెగా మేన‌ల్లుడు # 18

ఆ మ‌ధ్య ఓ చిన్న పాప‌కి సంబంధించిన వీడియో షేర్ చేసి త‌ప్పుల‌కు పాల్ప‌డిన వారిని క‌ట‌క‌టాల పాలు చేసాడు.

Update: 2024-10-25 12:44 GMT

మెగా మేన‌ల్లుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. అలాగే స‌మాజ సేవ ప‌ట్ల ఆస‌క్తి చూపిస్తుంటాడు. ఆ మ‌ధ్య ఓ చిన్న పాప‌కి సంబంధించిన వీడియో షేర్ చేసి త‌ప్పుల‌కు పాల్ప‌డిన వారిని క‌ట‌క‌టాల పాలు చేసాడు. దీంతో అత‌డు రియ‌ల్ హీరోలా అయ్యాడు. అలాగే అప్పుడ‌ప్పుడు రాజ‌కీయాల గురించి స్పందిస్తుంటాటు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన‌ పార్టీ బ‌లోపేతం కోసం తాను చేయాల్సింద‌ల్లా బ్యాకెండ్ లో చేస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో అత‌డు రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌కీయాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. `రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆలోచ‌న ప్ర‌స్తుతానికి లేదు. పాలిటిక్స్ లోకి రావాలంటే ఎన్నో విష‌యాల‌పై, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉండాలి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ప్ర‌స్తుతం నా ఫోక‌స్ అంతా సినిమాల‌పైనే ఉంది. ఎన్నో విభిన్న‌మైన సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నా`అని అన్నారు.

ప్ర‌స్తుతం సాయు దుర్గ‌తేజ్ హీరోగా 18వ సినిమా తెర‌కెక్కుతోంది. దీనికి రోహిత్ కేపీ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సాయి దుర్గ తేజ్ కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందుతుంది. బ‌డ్జెట్ 150 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. అలాగే ఈ సినిమా స్టోరీ గురించి రివీల్ చేసాడు. హాలీవుడ్ చిత్రం 300 యోధులు క‌థ‌ని ఆధారంగా రాసుకున్న క‌థ‌గా చెప్పుకొచ్చాడు. ఆ సినిమా స్పూర్తితోనే దీన్ని తెర‌కెక్కిస్తున్నాం అన్నాడు.

సినిమాలో ఎన్నో స‌ర్ ప్రైజ్ లుంటాయి. తెలుగు అభిమానులంతా ఇది మా సినిమా అని గ‌ర్వంగా చెప్పుకునేలా ఉంటుంద‌న్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ 30 శాతం పూర్తియంద‌న్నాడు. కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్ర‌మ‌ని, ఎంతో బాధ్య‌త‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ గా చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News