'హనుమాన్‌' రూ.120 కోట్లు మెగా హీరో కోసం..!

సినిమాకు వచ్చిన హిట్ టాక్‌ నేపథ్యంలో నాన్ థియేట్రికల్‌ బిజినెస్ తో కూడా నిర్మాత భారీగా లాభాలు దక్కించుకున్నాడు.

Update: 2024-07-03 12:05 GMT

ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమా 'హనుమాన్‌' పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది అనేది బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సినిమాకు వచ్చిన హిట్ టాక్‌ నేపథ్యంలో నాన్ థియేట్రికల్‌ బిజినెస్ తో కూడా నిర్మాత భారీగా లాభాలు దక్కించుకున్నాడు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న ఆఫ్ ది రికార్డ్‌ సమాచారం ప్రకారం హనుమాన్‌ నిర్మాత కె నిరంజన్‌ రెడ్డి హనుమాన్‌ సినిమాతో వందల కోట్ల లాభాలను సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయన మరిన్ని భారీ సినిమాలను నిర్మించి, భారీ విజయాలను దక్కించుకోవాలని ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ తో నిరంజన్‌ రెడ్డి కొత్త సినిమా ప్రారంభించాడు. రోహిత్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి రూ.120 కోట్ల బడ్జెట్‌ ని అనుకుంటున్నారట.

బడ్జెట్‌ లో మెజార్టీ అమౌంట్‌ ను భారీ సెట్స్ నిర్మాణం కోసం కేటాయించారట. సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో పాతిక నుంచి ముప్పై కోట్లు ఖర్చు చేస్తూ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. విభిన్నమైన కథ మరియు కథనం అవ్వడం వల్లే ఈ స్థాయిలో ఖర్చు కి వెనకాడటం లేదట.

హనుమాన్‌ సినిమాతో వచ్చిన లాభాలను నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ పై పెట్టేందుకు రెడీ అయ్యాడు. మరి ఆ లాభాలను వెనక్కి తీసుకు రావడంతో పాటు మరిన్ని లాభాలను సాయి ధరమ్‌ తేజ్ నిర్మాత నిరంజన్ రెడ్డికి తీసుకు వస్తాడా అనేది చూడాలి.

Tags:    

Similar News

eac