నిఖిల్ కోసం దబాంగ్ బ్యూటీ

టాలీవుడ్‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ ‘వి మేగా పిక్చర్స్’ మరియు అభిషేక్ అగర్వాల్ ‘ఎఎ ఆర్ట్స్’ కలిసి ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-02 07:01 GMT

టాలీవుడ్‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ ‘వి మేగా పిక్చర్స్’ మరియు అభిషేక్ అగర్వాల్ ‘ఎఎ ఆర్ట్స్’ కలిసి ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిఖిల్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో, రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ది ఇండియా హౌస్' అనే పేరు పెట్టారు. ఈ చిత్రం హంపిలోని విరూపాక్ష ఆలయంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవంలో చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

రేపటినుంచి హంపిలో ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా ప్రీ-ఇండిపెండెన్స్ యుగంలో లండన్‌లో జరిగిన నిజ ఘటనల ఆధారంగా రూపొందించబడుతోంది. అయితే సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఒక తమిళ హీరోయిన్ ఫైనల్ అయినట్లు నిన్న మొన్నటి వరకు కొన్ని గాలిప్స్ రాగా అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

ఫైనల్ గా కథకు సెట్టయ్యేలా ఒక.బ్యూటీఫుల్ హీరోయిన్ ను మేకర్స్ ఫైనల్ చేశారు. బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఇందులో ప్రధాన నాయికగా నటించనున్నారు. ఆమె హిందీలో సల్మాన్ ఖాన్ తో కలిసి దబాంగ్ 3 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే తెలుగులో గని, మేజర్, స్కంద లాంటి సినిమాల్లో నటించారు. నటిగా ఆమె.ఎప్పటికప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

Read more!

ఇక ఇప్పుడు నిఖిల్ తో ది ఇండియా హౌస్ అనే సినిమాలో మరొక విభిన్నమైన పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కథలో ఆమె చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఇదివరకే నిఖిల్ తో కార్తికేయ 2 సినిమాలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.

సినిమా ప్రముఖ ఛాయాగ్రాహకుడు కామెరూన్ బ్రైసన్ చేత ది ఇండియా హౌస్ చిత్రీకరించబడనుంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబడుతున్న ఈ చిత్రాన్ని భారీ కాన్వాస్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు. ఇక నిఖిల్ సిద్దార్థ్ ‘కార్తికేయ 2’, ‘అర్జున్ సురవరం’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తర్వాత మంచి జోష్‌లో ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన కెరీర్‌లో మరో మైలురాయి చేరుకోనున్నారు. సాయీ మంజ్రేకర్ కూడా బాలీవుడ్‌లోని కొన్ని ప్రముఖ చిత్రాలలో నటించి, తన నటనతో మంచి పేరుతెచ్చుకున్నారు. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రీ-ఇండిపెండెన్స్ నేపథ్యంలో పలు సంఘటనలపై ఆధారపడి ఉంటుంది. కథలోని విశేషాలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు.

Tags:    

Similar News