'అల్లు' చిచ్చు ఆరలేదా ?!

Update: 2024-06-12 13:17 GMT

ఏపీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయడం గెలవడం అందరికీ తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిచి జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ తో అందరినీ అలరించింది. అయితే ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతుగా నంధ్యాల వెళ్లడం అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెంచినట్లు ప్రచారం జరిగింది.

పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లకుండా నంధ్యాల వెళ్లడం ఏంటన్న వివాదం రేపింది. ఇక నాగబాబు పెట్టిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపగా నాగబాబు దాన్ని డిలేట్ చేయడం జరిగింది. అప్పటి నుండి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా సోషల్ మీడియాలో అనేక చర్చలు నడుస్తున్నాయి. అటు మెగా అభిమానులు, ఇటు అల్లు అభిమానులు ఎవరికి వారు తమ చర్యలను సమర్ధించుకుంటున్నారు.

ఈ పరిస్థితులలో తాజాగా అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహరెడ్డి ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లను సోషల్ మీడియాలో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ అన్ ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అల్లు కుటుంబంలో కేవలం అల్లు శిరీష్ ని మాత్రమే సాయిధరమ్ తేజ్ ఫాలో అవుతున్నాడు. అయితే మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ ను ప్రస్తుతానికి ఫాలో అవుతూనే ఉండటం విశేషం.

Tags:    

Similar News