ఆ ముగ్గురు కొత్త 'కలర్‌ ఫొటో' దిగేది ఎప్పుడో..?

ఈ దర్శకుడు మాత్రం తాను తయారు చేసుకున్న కథను రవితేజ కు వినిపించి ఆయనతో సినిమాకు రెడీ అవుతున్నాడు

Update: 2024-01-04 05:14 GMT

కలర్ ఫొటో సినిమా తో జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రాజ్ నటుడిగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ, దర్శకుడిగా మాత్రం సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సందీప్‌ రాజ్ కి పలువురు నిర్మాతల నుంచి ఆఫర్లు వచ్చాయి.

ఈ దర్శకుడు మాత్రం తాను తయారు చేసుకున్న కథను రవితేజ కు వినిపించి ఆయనతో సినిమాకు రెడీ అవుతున్నాడు. రవితేజ తో పాటు ఆ సినిమాలో మంచు మనోజ్ మరియు శర్వానంద్‌ కూడా నటించాలని దర్శకుడు ఆశ పడుతున్నాడు.

ముగ్గురు హీరోలు కూడా కథకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే ముగ్గురికి ముగ్గురు కూడా ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా రవితేజ చిన్న గ్యాప్‌ కూడా ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ఇతర హీరోలు కూడా వారి కమిట్‌మెంట్స్ తో బిజీగా ఉన్నారు.

రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు శర్వా మరియు మనోజ్ లు కొత్త ప్రాజెక్ట్‌ కి కమిట్ అయితే మళ్లీ సందీప్ రాజ్ మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సి రావచ్చు.

మొత్తానికి విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకుని మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తో ఈ ముగ్గురు కలర్‌ ఫొటో లాంటి సినిమాను చేసేది ఎప్పుడు అనేది ఇండస్ట్రీ వర్గాల వారు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News