పెళ్లి త‌ర్వాత క‌లిసి న‌టిస్తున్న జంట‌లు

అలాగే సిద్ధార్థ్ మ‌ల్హోత్రా- కియ‌రా అద్వాణీ జంట ఇప్పుడు పెళ్లి అనంత‌రం క‌లిసి న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

Update: 2024-10-19 20:30 GMT

పెళ్ల‌యిన త‌ర్వాత జంట‌గా న‌టించ‌డం బాలీవుడ్ లో ప్ర‌స్తుత‌ ట్రెండ్. సైఫ్ ఖాన్- క‌రీనా క‌పూర్ జంట‌, ర‌ణ‌బీర్ - ఆలియా జంట ఇప్ప‌టికే పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టించారు. అలాగే సిద్ధార్థ్ మ‌ల్హోత్రా- కియ‌రా అద్వాణీ జంట ఇప్పుడు పెళ్లి అనంత‌రం క‌లిసి న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

ముఖ్యంగా సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ జంట ప‌లు చిత్రాల్లో క‌లిసి న‌టించారు. అయితే పెళ్ల‌యాక మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ క‌లిసి న‌టించే అవ‌కాశం లేదు. కానీ ఇత‌ర హీరోల‌తో కియ‌రా, ఇత‌ర హీరోయిన్ల‌తో సిద్ధార్థ్ న‌టిస్తున్నారు. త‌దుప‌రి ప్రేమ‌క‌థ‌లో జంట‌గా ఆఫ‌ర్ అందుకున్నారని స‌మాచారం.

సిధ్- కియ‌రా చివరగా `షేర్షా`లో జంట‌గా న‌టించారు. అటుపై మళ్లీ కలిసి పని చేయలేదు. కొంత గ్యాప్ త‌ర్వాత‌ రొమాంటిక్ డ్రామాలో న‌టించేందుకు ఈ జంట సిద్ధ‌మ‌వుతోంద‌ని స‌మాచారం. ప్ర‌ఖ్యాత మ‌డాక్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రేమ‌క‌థ ఓకే అయింది. ఈ జంట‌ను అందంగా చూపించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది. త‌దుప‌రి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నార‌ని స‌మాచారం. మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమవుతుంది.

మ‌రోవైపు కియ‌రా వ‌రుస‌గా గేమ్ ఛేంజ‌ర్, డాన్ 3, వార్ 2 లాంటి క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇటు మ‌ల్హోత్రా రేస్ 4 కోసం ప‌ని చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇవ‌న్నీ అత్యంత భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి రానున్నాయి.

Tags:    

Similar News