SSMB28: టైటిల్ ఇదేనా.. రిలీజ్ ఎప్పుడు?

కానీ ఈ సినిమాతో 'గరుడ'కు ఎటువంటి సంబంధం లేదని టీమ్ వర్గాలు స్పష్టం చేశాయి.

Update: 2024-08-24 06:40 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే. రగ్గడ్ లుక్ లో ఉన్న మహేశ్ ఫోటోలను చూసిన అభిమానులు, రాజమౌళి SSMB29 కోసం లుక్ సిద్ధమైనట్లే అని అనుకున్నారు. గ్రాండ్ గా 1500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా మహేశ్ బాబు తదుపరి ప్రాజెక్ట్ కావడంతో, ఈ లుక్ పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. కథ, సినిమాకి సంబంధించిన ఇతర అంశాలు కూడా టీమ్ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. కానీ, ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని గతంలో రచయిత విజయేంద్రప్రసాద్ ఒక హింట్ ఇచ్చారు. ఇలాంటి కథ నేపథ్యంలో మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించడం మరోసారి అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది.

ఇక రీసెంట్ గా SSMB29 కోసం వర్క్ చేస్తున్న విజువల్ ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ ఫ్రేమ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టైటిల్ పై చర్చ మొదలైంది. రెండు రెక్కలు ఉన్న ఆర్ట్ పిక్ ను పోస్ట్ చేయగా ఇది 'గరుడ' అనే టైటిల్ తో రానున్నట్లు టాక్ వస్తోంది. ఎప్పటినుండో రాజమౌళి మనసులో 'గరుడ' ప్రాజెక్ట్ అయితే ఉంది. ఒక స్పీచ్ లో రాజమౌళి ఆ టైటిల్ గురించి చెప్పాడు కానీ మిగతా విషయాలు పెద్దగా రివీల్ చేయలేదు.

అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మహేశ్ బాబు 29వ చిత్రం గరుడ ప్రాజెక్ట్ కాదని స్పష్టమైంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తిగా వేరు అని కన్ఫర్మ్ చేశారు. ‘గరుడ’ కోసం రాజమౌళి ఎంతో కాలంగా ప్రణాళికలు రచిస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి రావడం సహజమేనని కొందరు భావిస్తున్నారు. కానీ ఈ సినిమాతో 'గరుడ'కు ఎటువంటి సంబంధం లేదని టీమ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇక మరోవైపు, ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో కొత్తగా వచ్చిన రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 2028లో ఈ సినిమాను విడుదల చేయనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం టీమ్ పూర్తిగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయిందని తెలుస్తోంది. 2028 వరకు సినిమాను ఫినిష్ చేసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ ఏడాది చివరలో రానుందట. ఇక సినిమా ఎప్పుడు వస్తుంది అనేది కాలమే సమాధానం ఇవ్వాలి.

Tags:    

Similar News