రాజమౌళితో ఆ హీరో.. ఏంటి మ్యాటర్?

ఫర్ ది ఫస్ట్ టైం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి.

Update: 2023-12-26 03:15 GMT

గత ఏడాది 'RRR' తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఫర్ ది ఫస్ట్ టైం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది.

ప్రస్తుతం రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమాని రాజమౌళి ప్లాన్ చేశారని, దాదాపు మూడు భాగాలుగా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.

మరోవైపు ఈ ఏడాది చివరి కల్లా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ కానందుని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో రాజమౌళి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు న్యూస్ వినిపించింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి తరుణంలో రాజమౌళి ఇప్పుడు మరో స్టార్ హీరోని లైన్ లో పెట్టినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దాని ప్రకారం రాజమౌళి మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారట.

టాలీవుడ్ లో ఉన్న ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును బ్యాంక్ రోల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, RRR వంటి సినిమాలు రాగా ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తవగానే 'వార్ 2' షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

ఆ తర్వాత రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే మరోసారి వీరి కాంబినేషన్ తో బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని చెప్పొచ్చు. కాగా రాజమౌళి మహేష్ సినిమాని పూర్తి చేశాకా ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా? లేక ముందే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తాడా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనే కన్ఫర్మ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags:    

Similar News