పుష్ప 2 జాతర: ట్విస్ట్ ఏమిటంటే..

'పుష్ప 2' లోని యాక్షన్ ఘట్టాలు అన్ని కూడా హైవోల్టేజ్ లో గూస్ బాంబ్స్ క్రియేట్ చేసేలా సుకుమార్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

Update: 2024-09-19 04:05 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. గత కొంతకాలంగా సుకుమార్ గ్యాప్ తీసుకోకుండా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ‘పుష్ప 2’ షూటింగ్ జరుగుతోంది. సినిమాలోని కీలకమైన ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ‘పుష్ప 2’లోని యాక్షన్ ఘట్టాలు అన్ని కూడా హైవోల్టేజ్ లో గూస్ బాంబ్స్ క్రియేట్ చేసేలా సుకుమార్ డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని తెలుస్తోంది. అందులో ఇప్పటికే రెండు సాంగ్స్ కి రిలీజ్ చేశారు. ఈ సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిగిలిన రెండు సాంగ్స్ లో ఒకటి ఐటెం పాటగా ఉండబోతోంది. దాంతో పాటు జాతర బ్యాక్ డ్రాప్ లో ఒక సాంగ్ ని చిత్రీకరించారంట. ఈ సాంగ్ మూవీకి హైలైట్ గా ఉంటుందని సమాచారం. అయితే ఈ సాంగ్ ని సినిమా రిలీజ్ కి ముందు వదిలే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది.

కేవలం ఈ జాతర సాంగ్ ని థియేటర్స్ లోనే ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేయాలని సుకుమార్ అనుకుంటున్నారంట. అందుకే ఈ సాంగ్ ని ముందస్తుగా రిలీజ్ చేసే ప్రయత్నం చేయడం లేదనే టాక్ నడుస్తోంది. మూవీ రిలీజ్ తర్వాత జాతర సాంగ్ సెన్సేషన్ అవుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అలాగే జాతర బ్యాక్ డ్రాప్ లోనే యాక్షన్ ఘట్టాలు కూడా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. మేగ్జిమమ్ పుష్ప 2 షూటింగ్ అక్టోబర్ నెల ఆఖరుకి కంప్లీట్ చేయొచ్చని ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు. తరువాత మూవీ ప్రమోషన్స్ పై మేకర్స్ ఫోకస్ చేయనున్నారు.

వీలైనంత స్ట్రాంగ్ గా ఈ సినిమాని మార్కెట్ లోకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా 550 వరకు థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకోవాలంటే మౌత్ టాక్ అయితే గట్టిగా ఉండాలి. ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్లుగా సుకుమార్ ‘పుష్ప 2’ సినిమాని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే రిలీజ్ కి ముందు ‘పుష్ప 2’ కంటెంట్ తో కూడా భారీ హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2024లో అతిపెద్ద ప్రాజెక్ట్ గా మారుతుంది. కంటెంట్ ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ అందుకుంటే అత్యధిక వసూళ్లు అందుకునే చిత్రంగా కూడా మారే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన నటిస్తోంది. పుష్పలో ఉన్న యాక్టర్స్ తో పాటు అదనంగా మరికొంతమందిని కీలక పాత్రల కోసం సుకుమార్ తీసుకున్నారు. అందులో జగపతిబాబు కూడా ఉండటం విశేషం.

Tags:    

Similar News