దుబాయ్ వ్యాపారవేత్త‌తో అగ్ర క‌థానాయిక పెళ్లి?

ప్ర‌ముఖ టాలీవుడ్ క‌థానాయిక త్వ‌ర‌లో దుబాయ్‌కి చెందిన ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్తను వివాహం చేసుకోనుందని ఊహాగానాలు కొన‌సాగుతున్నాయి.

Update: 2024-09-30 04:04 GMT

ప్ర‌ముఖ టాలీవుడ్ క‌థానాయిక త్వ‌ర‌లో దుబాయ్‌కి చెందిన ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్తను వివాహం చేసుకోనుందని ఊహాగానాలు కొన‌సాగుతున్నాయి. ఇరు కుటుంబాలు ఏర్పాటు చేసిన స‌మావేశంలో మిస్టర్ రైట్ ని స‌ద‌రు న‌టి కలుసుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త న‌టిని పెళ్లాడేందుకు సుముఖంగా ఉన్నాడు. అందువ‌ల్ల‌ వివాహ ప్రమాణాలను మార్చుకోవడానికి స‌ద‌రు హీరోయిన్ కూడా సిద్ధంగా ఉంది.

కుటుంబ సభ్యులు ఇప్పటికే సమావేశమై పెళ్లి గురించి చర్చించుకున్నారు.. త్వ‌ర‌లోనే శుభ‌వార్త అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ప‌రిశ్రమ అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగిన ఈ అపురూప సౌంద‌ర్య‌రాశి పెళ్లి గురించి చాలా కాలంగా తల్లిదండ్రులు ఆత్రుత‌గా ఉన్నారని, కొన్నాళ్ల క్రితం నటి కూడా అందుకు అంగీకరించిందని క‌థ‌నాలొస్తున్నాయి.

ప్ర‌ముఖ హీరోని పెళ్లాడుతుంద‌ని, లేదు ద‌ర్శ‌కుడి కుమారుడిని పెళ్లాడుతుంద‌ని క‌థ‌నాలు వ‌చ్చినా అవ‌న్నీ రూమర్లుగానే మిగిలాయి. ఎట్ట‌కేల‌కు దుబాయ్ వ్యాపార‌వేత్త‌తో జీవితంలో సెటిల్ కానుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. కానీ అధికారికంగా దీనిని ధృవీక‌రించాల్సి ఉంది.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాల్లో ఈ వార్త విస్త్ర‌తంగా వైర‌ల్ అవుతోంది. అయితే స‌ద‌రు క‌థానాయిక కానీ, త‌న పీఆర్ బృందం కానీ ఇంకా వార్తలను ధృవీకరించలేదు. ప్ర‌స్తుతం ఓ రెండు సినిమాల్లో న‌టిస్తూ సైలెంట్ గా త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. పెళ్లి అధికారికంగా ఫిక్సయ్యాక శుభ‌వార్త చెబుతుందేమో వేచి చూడాలి.

Tags:    

Similar News