వరలక్ష్మీ శరత్ కుమార్.. ఆ దర్శకుడితో మళ్లీ అలా..

జైలర్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన విజయ్ కార్తీక్ కన్నన్ ఈ సినిమాకు కూడా పని చేయబోతున్నారు

Update: 2023-08-11 05:30 GMT

తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు రమ్యకృష్ణ. కానీ ఇప్పుడా చోటును వరలక్ష్మి శరత్ కుమార్ భర్తీ చేసేసింది. హీరోయిన్ గా కన్నా నెగిటివ్ పాత్రలతోనే ఆమె మస్త్ క్రేజ్ సంపాదించుకుంది. తమిళంలో 'పందెం కోడి-2', 'సర్కార్‌', 'మారి 2' చిత్రాలు ఆమె కెరీర్‌ కు టర్నింగ్ పాయింట్ గా నిలవగా.. తెలుగులో 'క్రాక్', 'యశోద్', 'వీరసింహారెడ్డి' మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఆడియెన్స్ ఆమె విలనిజంకు బాగా కనెక్ట్ అయిపోయారు. చివరిగా 'వీరసింహారెడ్డి'తో సినీ ప్రియులను భయపెట్టించి, కంటతడి పెట్టించిన ఆమె.. తెలుగులో మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. అది కూడా మళ్లీ గోపీచంద్ మలినేని సినిమాలోనేని తెలిసింది.

సాధారణంగా గోపిచంద్ మలినేని తన చివరి రెండు చిత్రాలు 'క్రాక్', 'వీర సింహారెడ్డి' నుంచి పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ను పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కొత్త చిత్రంలోనూ ఇలాంటి పాత్రను కొనసాగించబోతున్నారని తెలిసింది. ఆయన ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.

మైత్రీ మూవీస్ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ఆయన తన లక్కీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఓ పవర్ పుల్ స్పెషల్ రోల్ కోసం తీసుకోబోతున్నట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీని గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించనుందని తెలిసింది.

ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. జైలర్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన విజయ్ కార్తీక్ కన్నన్ ఈ సినిమాకు కూడా పని చేయబోతున్నారు. ఓ డిఫరెంట్ పక్కా యాక్షన్ సినిమాగా ఇది రూపొందనుందట. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభంకానుందని సమాచారం. ఇప్పటికే గోపిచంద్ - రవితేజ కాంబోలో వచ్చిన 'డాన్ శ్రీను', 'బలుపు', 'క్రాక్' సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ కొత్త చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News