క్లైమాక్స్ యాక్షన్ తో `విశ్వంభ‌ర` ముగింపు!

అటుపై షూట్ అంతా ఆర్ ఎఫ్ సీలోనే జ‌రుగుతోంది. ఇక చిత్రీక‌ర‌ణ ముగింపుకు వ‌చ్చింద‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Update: 2024-08-05 07:30 GMT

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా విశ‌ష్ట ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ `విశ్వంభ‌ర‌` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ అంతా దాదాపు హైద‌రాబాద్ లోనే చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ప్ర‌త్యేకంగా భారీ సెట్లు నిర్మించి పూర్తి చేస్తున్నారు. సోషియా ఫాంట‌సీ చిత్రం కావ‌డంతో ఔట్ డోర్ షూటింగ్ పెద్ద‌గా లేదు. తొలి షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభించారు.

అటుపై షూట్ అంతా ఆర్ ఎఫ్ సీలోనే జ‌రుగుతోంది. ఇక చిత్రీక‌ర‌ణ ముగింపుకు వ‌చ్చింద‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ అందులో వాస్త‌వం తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో అప్ డేట్ వ‌చ్చేసింది. క్లైమాక్స్ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు యూనిట్ తెలిపింది. ప్ర‌త్యేకంగా తీర్చి దిద్దిన సెట్లో స్టంట్ మాస్ట‌ర్ అన‌ల్ అర‌సు నేతృత్వంలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా ఉంటుంద‌ని తెలిపారు.

దీంతో మ‌రికొన్ని రోజుల్లోనే చిరంజీవి `విశ్వంభ‌ర` షూటింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని తెలుస్తోంది. అటుపై మ‌ళ్లీ డ‌బ్బింగ్ ప‌నుల వ‌ర‌కూ చిరు అవ‌సరం లేదు. ఇప్ప‌టికే చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సోషియా ఫాంట‌సీ సినిమా కావ‌డంతో గ్రాఫిక్స్ ప‌నుల‌కు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. అంటే దాదాపు నాలుగు నెల‌లు పాటు ఆ ప‌నుల‌కే స‌మ‌యం కేటాయిం చారు? దీన్ని బ‌ట్టి సీజీ వ‌ర్క్ ప్రాధాన్య‌త తెలుస్తుంది.

అయితే ఈ గ్యాప్ లో చిరంజీవి కొత్త సినిమా ప్రారంభిస్తారా? రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేస్తారా? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే 157వ సినిమా ప్ర‌క‌ట‌నైతే వ‌చ్చింది. కానీ దానిపై మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. అయితే పాన్ ఇండియాలో సంచ‌ల‌నం సృష్టించిన `హ‌నుమాన్` సీక్వెల్ `జైహ‌నుమాన్` లో న‌టించ‌డానికి చిరంజీవి సైతం ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది.

Tags:    

Similar News