మెదడు క్యాన్సర్‌పై ఇదో అతిపెద్ద విజయం.. వ్యాధిని కనిపెట్టే దివ్యయంత్రం

క్యాన్సర్.. ఈ వ్యాధి పేరు వింటేనే నిద్రలోనైనా ఉలిక్కిపడుతాం. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి అనేది అందరికి తెలిసిందే.

Update: 2024-09-02 16:30 GMT

క్యాన్సర్.. ఈ వ్యాధి పేరు వింటేనే నిద్రలోనైనా ఉలిక్కిపడుతాం. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి అనేది అందరికి తెలిసిందే. అయితే.. క్యాన్సర్‌లోనూ కొన్నింటికి ట్రీట్‌మెంట్ ఉండగా.. మరికొన్నింటికి లేదు. ఒక్కసారి ఆ వ్యాధి బారిన పడ్డామంటే శారీరకంగానూ, మానసికంగానూ కుంగిపోవడం ఖాయం. మెదడు సహా శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేస్తుంటుంది ఈ వ్యాధి. ఇంతటి భయంకరమైన వ్యాధిని గుర్తించడంలో వైద్యులు మరో విజయం సాధించారు.

క్యాన్సర్‌లో బ్రెయిన్ క్యాన్సర్ వెరీ డేంజరస్. ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చు. ఏజ్ లిమిట్ కూడా లేకుండా ఈ వ్యాధి సోకుతుంటుంది. 15 ఏళ్ల యువకుడి నుంచి మధ్య వయస్సు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాధిని గ్లియోబ్లాస్టోమా అని పిలుస్తారు. ఈ వ్యాధిని వేగంగా కనిపెట్టేందుకు వైద్యులు ఓ పరికరాన్ని కనిపెట్టారు.

క్యాన్సర్ వ్యాధిని మనిషి నుంచి కణజాలాన్ని సేకరించి.. దానిని టెస్టు చేయడం ద్వారా గుర్తించి నిర్ధారిస్తారు. ఇందుకు చిన్న సర్జరీ చేస్తారు. దీనికి కొంత సమయం కూడా పడుతుంది. అయితే.. ఈ ప్రాసెస్‌లో కాకుండా కొత్తగా రక్త పరీక్ష విధానం ద్వారా వ్యాధిని నిర్ధారించేందుకు ఈ పరికరాన్ని కనుగొన్నారు. ఇందులో కీలకంగా ఉండే బయోచిప్, క్యాన్సర్‌కు కారణమైన ఈజీఎఫ్ఆర్ వంటి కణాలను గుర్తిస్తుందని నాట్రదామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది.

అయితే.. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ పరీక్షకు ధర కూడా ఏ స్థాయిలో ఉంటుందోనని భయపడుతున్నారా..? దానికి పెద్దగా టెన్షన్ అక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే రూ.168 కంటే తక్కువే ఉండబోతోందని వెల్లడించారు.

Tags:    

Similar News