సంచలనం... దావూద్ కుమార్తె పెళ్లి గౌనుకు ఓ కిడ్నాప్ కు సంబంధం!

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి.

Update: 2024-08-19 05:38 GMT

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ శైలేంద్ర శ్రీవాస్తవ రాసిన "షాకిల్ ది స్టార్మ్" అనే పుస్తకంలో దావూద్ ఇబ్రహీం కు సంబంధించిన ఓ సంచలన విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఓ సంచలన కిడ్నాప్ వ్యవహారం బహిర్గతమైంది.

అవును... మాఫీయాడాన్ దావూద్ ఇబ్రహీం కి సంబంధించిన ఓ సంచలన విషయం తాజగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... దావూద్ కుమార్తె పెళ్లి గౌనుకు, మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ హైప్రొఫైల్ పారీశ్రామిక వేత్త కుమారుడి కిడ్నాప్ కు సంబంధం ఉందని శైలేంద్ర శ్రీవాస్తవ్ ఐపీఎస్ రాసిన పుస్తకంలో బహిర్గతం అయ్యింది. అదేమిటన్నది ఇప్పుడు చూద్దాం..!

2005 జూలైలో దావూద్ ఇబ్రహీం కుమార్తె మహరూఖ్ వివాహం మక్కాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన గౌన్ ను మధ్యప్రదేశ్ లోని శివపూర్ కు చెందిన ఇస్మాయిల్ ఖాన్ అనే దర్జీ తయారుచేశాడు. ఈ వివాహం అయిన సుమారు నెల రోజుల తర్వాత ఆగస్టు 14న మధ్యప్రదేశ్ లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కుమారుడైన నితీశ్ నాగోరీ (20) కిడ్నాప్ అయ్యాడు.

ఈ సమయంలో అతడిని విడుదల చేయాలంటే రూ.4 కోట్లు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకొని ఆ కుర్రాడిని విడుదల చేశారు. అయితే... ఈ కిడ్నాప్ కేసులో శివ్ పుర్ కు చెందిన దర్జీ ఇస్మాయిల్ ఖాన్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. అతడే దావూద్ కుమార్తె వివాహ హౌన్ తయారుచేసిన ధర్జీ.

ఈ కిడ్నాప్ నుంచి వసూల్ చేయాలనుకొన్న సొమ్ములో కొంత దావూద్ కి కూడా వాటా వెళ్లాల్సి ఉన్నట్లు పోలీసులు గుర్తించారట. ఇదే సమయంలో ఈ కిడ్నాప్ చేస్తే ఇస్మాయిల్ కు దుబాయ్ లో ఓ ఉద్యోగం కూడా ఇప్పిస్తామని ఆశ చూపించారు. ఇదే సమయంలో దావుద్ కుమార్తె పెళ్లి గౌన్ కుట్టినందుకు కోటి నగదు కూడా ఇస్తామని చెప్పారు. అయితే.. ఈ కిడ్నాప్ వ్యవహారం విఫలం కావడంతో ఇస్మాయిల్ దుబాయ్ కి పారిపోయాడు.

ఇదే క్రమంలో... ఈ కిడ్నాప్ కేసులో నితీశ్ తో సన్నిహితంగా ఉండే స్నేహితులు కూడా దావూద్ ముఠాకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ధ్రువ్, గౌరవ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి అందిన సమాచారం మేరకు ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఇస్మాయిల్ మాస్టర్ మైండని.. అతడి వెనుక ఉన్నది దావూద్ ఇబ్రహీం అని బయటపడింది!

దీంతో... దావూద్ ఇబ్రహీం కిడ్నాప్ స్టైల్ ఎలా ఉంటుంది అనే అంశం మరోసారి తెరపైకి వచ్చి చర్చనీయాంశం అవుతుంది. ఇలా డాక్టర్ శ్రీవాస్తవ రాసిన ఈ పుస్తకంలో కేవలం నేరాల గురించి మాత్రమే కాదు.. వాటికి వ్యతిరేకంగా నిలబడిన వారి ధైర్య సాహసాల గురించి కూడా పొందుపరిచారు. తీవ్రవాదం, అండర్ వరల్డ్ పై మధ్యప్రదేశ్ లో జరిగిన పోరాటాల గురించి ఎన్నో స్టోరీలు ఇందులో పొందుపరిచారు.

Tags:    

Similar News