మందుబాబులకు శుభవార్త... ఆ లిక్కర్ వచ్చేసింది కానీ...!

అవును... ఏపీలో బాబు హామీలపై నమ్మకముంచిన పలువురు మందుబాబులు ఎదురుచూస్తున్నట్లు చెబుతోన్న రూ.99 క్వార్టర్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి!

Update: 2024-10-23 11:25 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. అక్టోబర్ 16 నుంచి కొత్త వైన్ షాపులు ఓపెన్ అయ్యాయి. ఈ నెల 14వ తేదీన షాపులను లాటరీల్లో కేటాయించగా.. రెండు రోజుల్లోనే కొత్త, పాత మేళవింపు సరుకుతో కొత్త ప్రైవేటు వైన్ షాపులు కళకళలాడిపోయాయి!

ఇందులో భాగంగా... రకరకాల పాత బ్రాండ్ల మధ్య బాటిళ్లు కొత్తగా మెరవడం ప్రారంభించాయని మందుబాబులు సొషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ సమయంలో... గత ప్రభుత్వ హయాంలో ధరలకూ.. ఇప్పటి ధరలకూ మధ్య వ్యత్యాసంపై వైన్ షాప్ పరిసరాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయి.

వీటిలో ప్రధానంగా రూ.99 క్వార్టర్ పై మందుబాబులు అసంతృప్తిగా ఉన్నారు! చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా... నాణ్యమైన మద్యం తక్కువ ధరకు. దీంతో.. వైన్ షాపులు ఓపెన్ అయిన రోజే ఈ రూ.99 క్వార్టర్ దొరుకుతుందని భావించారు. అయితే... నాడు ఆ బాటిల్ కోసం చూసి నిరాశ చెందినవారికి తాజాగా గుడ్ న్యూస్ వచ్చింది.

అవును... ఏపీలో బాబు హామీలపై నమ్మకముంచిన పలువురు మందుబాబులు ఎదురుచూస్తున్నట్లు చెబుతోన్న రూ.99 క్వార్టర్స్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి! అయితే... ప్రస్తుతం ఒక్కో వైన్ షాప్ కు 3 నుంచి 8 కేసులను మాత్రమే సరఫరా చేస్తుండగా.. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు చెబుతున్నారు.

దీంతో... ఇప్పటికే రు.99 క్వార్టర్ రుచి చూసినవారు తమదైన శైలిలో ఫీడ్ బ్యాక్ ఇస్తుండగా.. ఈసారి మిస్ అయినవాళ్లు తమ రోజు కోసం ఎదురుచూస్తునారని అంటున్నారు. ఏది ఏమైనా... చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News