ఆనాటి బాబును మళ్ళీ చూస్తారంటూ ముఖ్యమంత్రి కామెంట్స్ ...!

తాను ఏది చేప్పినా సూటిగా స్పష్టంగా చెబుతాను అని తాను సైతం సమయం చూసుకుంటూ వుంటాను అని అన్నారు.

Update: 2024-08-05 10:31 GMT

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. ఒక వైపు నేను మారిపోయాను అంటూనే మరో వైపు 1995 నాటి బాబుని చూస్తారు అని ఆయన వ్యాఖ్యానించారు. తాను మారాను అని బాబు చెప్పారు. గంటల తరబడి ఇక మీదట తన ప్రసంగాలు ఉండవని ఆయన చెప్పారు.

తాను ఏది చేప్పినా సూటిగా స్పష్టంగా చెబుతాను అని తాను సైతం సమయం చూసుకుంటూ వుంటాను అని అన్నారు. తాను నాలుగోసారి సీఎం అయ్యాక అత్యధికంగా మీటింగ్ ని అడ్రస్ చేసిన సమయం గంటన్నర అని ఆయన అన్నారు. దాదాపుగా అన్ని మీటింగ్స్ ని అరగంట కంటే ఎక్కువ టైం లేకుండా తాన ప్రసంగం ఉంటోందని చెప్పారు.

అంతే కాదు మీటింగ్ అర్ధవంతంగా జరగాలని ఆయన కోరారు. సబ్జెక్ట్ తో ఎవరైనా రాకపోయినా మళ్ళీ మీటింగ్ పెట్టుకుందామని చెబుతున్నాను తప్ప టైం వేస్ట్ చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. ఇదిలా ఉంటే తాను సమర్ధతలో గుడ్ అడ్మినిస్ట్రేషన్ లో మళ్ళీ 1995 నాటి పీరియడ్ కి వెళ్తాను అని బాబు స్పష్టం చేశారు.

ఆనాడు తాను ఎంతో డైనమిక్ గా ఉండేవాడిని అని చెప్పారు. అప్పట్లో తరచూ ఆకస్మిక తనిఖీలు చేయడం ద్వారా పాలనలో వేగం పెంచామని అన్నారు. ఇపుడు కూడా మళ్లీ అలాంటి సడెన్ సర్ప్రైజ్ విజిటింగ్స్ ఉంటాయని బాబు హింట్ ఇచ్చారు. అంగన్ వాడీ కేంద్రాల నుంచి దిగువ స్థాయి వ్వ్యవస్థలలో ఫంక్షనింగ్ ఎలా ఉందో తాను తెలుసుకోవడానికే ఈ ఆకస్మిక తనిఖీలు అని చెప్పారు.

అదే సమయంలో కలెక్టర్లు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. బాగా పనిచేసిన కలెక్టర్లను మూడేళ్ళు కాదు ఆరేళ్ళు అయినా పనిచేసే చోట కొనసాగిస్తామని బాబు చెప్పారు. కలెటర్లు జాబ్ ఓరియెంటెడ్ గా కాకుండా వినూత్న ఆలోచనలు చేయాలని అప్డేట్ అవుతూ ఉండాలని ఆయన సూచించారు. ప్రజా కోణంలో పాలన జిల్లా స్థాయిలో కొనసాగించాలని ఆయన చెప్పారు.

ఇక తాను గతంలో సీఎం గా ఉన్నపుడు అభివృద్ధి విషయంలో కొన్ని కీలక సంస్కరణలు తీసుకున్నాను అని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ తో ఆనాడు ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ పీ3తో భిన్నంగా ముందుకువెళ్ళామని విజయం సాధించామని చెప్పారు.

ఇపుడు పీ 4 మోడల్ ని తీసుకున్నామని చంద్రబాబు ప్రకటించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్ పీ 4 మోడల్ తో ముందుకు వెళ్దామని ఆయన అన్నారు. దీని ద్వారా బాగా డబ్బున్న పది మంది దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ఇరవై కుటుంబాలను ముందుకు తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు.

ప్రతీ ఊరి నుంచి గొప్ప వారు ఎంతో మంది బయటకు వస్తున్నారని అదే సమయంలో ఆ ఊరిలో వారి సాటి మనుషులు ఇంకా పేదలుగా ఉండిపోతున్నారని బాబు గుర్తు చేశారు. ఆ పరిస్థితి లేకుండా ఆ ఊరి నుంచి వచ్చి ఉన్నత స్థానంలో ఉన్న వారు తమ ఊరిలో పేదలను కూడా తమతో పాటు ఆర్ధికంగా బలోపేతం చేసే కాన్సెప్ట్ తోనే పీ 4 ని రూపొందించామని బాబు అన్నారు. ఇది సక్సెస్ అవుతుందని భావిస్తున్నట్లుగా బాబు చెప్పారు. కలెక్టర్లు కూడా ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఆయన కోరారు.

Tags:    

Similar News