జగన్ కు ఉన్న క్రేజ్ కు నిదర్శనం ఈ ఫోటో

అంతేకాదు.. తనకుమార్తెను వెంట తీసుకొచ్చిన ఆమె.. ఆయనతో కలిసి ఫోటో దిగేందుకు అనుమతి కోరిన వైనం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-09-12 04:12 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉంది? సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకున్న ఆయన పని అయిపోయిందంటూ చేసే విమర్శలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ పాత కేసులో అరెస్టై అయి.. జైల్లో ఉన్న వేళ.. ఆయన్ను పరామర్శించేందుకు గుంటూరు జైలు వద్దకు బుధవారం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అయేషా బాను.. తన విధుల్ని నిర్వహిస్తూనే.. జగన్ వచ్చినంతనే ఆయన్ను కలిసేందుకు.. ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. అంతేకాదు.. తనకుమార్తెను వెంట తీసుకొచ్చిన ఆమె.. ఆయనతో కలిసి ఫోటో దిగేందుకు అనుమతి కోరిన వైనం ఆసక్తికరంగా మారింది.

అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ ఆయేషా బాను అందరి మధ్య నుంచి లోపలకు వచ్చి.. జగన్ తో సెల్ఫీ దిగేందుకు అనుమతి కోరారు. పోలీస్ యూనిఫారంలో ఉన్న ఆమెను.. ఆమె కుమార్తెను ఫోటో దిగేందుకు జగన్ సరేనని చెప్పటంతో.. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందిగం సురేశ్ ఇతరుల్ని జైల్లో పరామర్శించిన జగన్ బయటకు వచ్చిన సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఆయేషా భాను అనంతపురానికి చెందిన వారుగా చెబుతున్నారు. గుంటూరు జైల్లో విధులు నిర్వర్తిస్తున్న అంశం బయటకు వచ్చింది. ఆమె ప్రదర్శించిన అభిమానానికి ప్రతిగా జగన్ ఆమెతో మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న ఆమె జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన వైనాన్ని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం.. జగన్ మీద ప్రజల్లో అభిమానానికి ఈ ఉదంతం ఒక నిదర్శనంగా పేర్కొంటున్నారు.

Tags:    

Similar News