రఘురామరాజుకి అలా షాకిచ్చిన వైఎస్ జగన్ ఫ్యాన్స్!

ఎన్నికల సీజన్ అయినా, కాకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిత్యం హాట్ టాపిక్ గా ఉంటాయి.

Update: 2024-07-08 09:47 GMT

ఎన్నికల సీజన్ అయినా, కాకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిత్యం హాట్ టాపిక్ గా ఉంటాయి. ప్రతీ రోజూ ఏపీ రాజకీయాల్లో ఏదో ఒక ఆసక్తికర పరిణామాలు జరుగుతుంటాయి.. మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. వాటిపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ, కామెంట్ సెక్షన్ లో యుద్ధం జరుగుతుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఉండి ఎమ్మెల్యే రఘురామ రాజుకి జగన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చిన ఘటన తెరపైకి వచ్చింది.

అవును... ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ టిక్కెట్ పై గెలిచిన రఘురామకృష్ణంరాజు చేసిన సందడి అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే! నాడు టీడీపీ, జనసేనలు సైతం స్పందించని విషయాలను ఎత్తుకుని.. ప్రభుత్వంపై విరుచుకుపడేవారు రఘురామ. ఈ క్రమంలో రఘురామ పార్టీ మారారు.. ఏపీలో ప్రభుత్వమూ మారింది. అయినా... వైసీపీ వర్సెస్ ట్రిపుల్ ఆర్ టాపిక్ మాత్రం సజీవంగానే ఉంది!

ఆ స్టేట్ మెంట్ కు బలం చేకూర్చే సంఘటన తాజాగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో జరిగింది. ఇందులో భాగంగా... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రఘురామ కృష్ణంరాజుకి అక్కడున్న జగన్ ఫ్యాన్స్ నుంచి చిన్నపాటి షాక్ తప్పలేదు! ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు.

ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న రఘురామ రాజుకు జగన్ ఫ్యాన్స్ షాకిచ్చారు! ఇందులో భాగంగా రఘురామ కృష్ణంరాజుని చూడగా... "జై జగన్.. జై జగన్" నినాదాలతో హోరెత్తించేశారు. అయితే... ఆ నినాదాలకు నవ్వుతూ, వాటిని పట్టించుకోనట్లుగా ఆయన ముందుకు సాగారు! దీంతో... వారు వెంటపడి మరీ మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఇష్యూ వైరల్ గా మారుతోంది!

Tags:    

Similar News