"జ‌ర్న‌లిస్టులు ఉద్యోగులు కాదు.. అలా చెప్పుకోకండి ప్ర‌జ‌లు న‌వ్వుతారు!"

అయితే.. తాజాగా బాంబే హైకోర్టు ఓ వివాదాన్ని ప‌రిష్క‌రించే క్ర‌మంలో జ‌ర్న‌లిస్టుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

Update: 2024-03-06 09:45 GMT

దేశ‌వ్యాప్తంగా జ‌ర్న‌లిస్టులు కొన్ని ల‌క్ష‌ల మంది ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే రెండు కోట్ల మంది గుర్తింపు పొంద‌ని జ‌ర్న‌లిస్టులు ఉన్నార‌ని ఒక అంచ‌నా ఉంది. అయితే.. వీరు ఉద్యోగులా? కాదా? అనే చ‌ర్చ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే.. వారు ప‌నిచేస్తున్న మీడియా సంస్థ‌లు ఎంతో కొంత జీతాల రూపంలో ఇస్తున్నాయి. అయితే.. తాజాగా బాంబే హైకోర్టు ఓ వివాదాన్ని ప‌రిష్క‌రించే క్ర‌మంలో జ‌ర్న‌లిస్టుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

వర్కింగ్ జర్నలిస్ట్‌లు ఉద్యోగుల పరిధిలోకి రారని తేల్చి చెప్పింది. వాళ్లకు స‌మాజంలో స్పెషల్ స్టేటస్ లభిస్తోందని, వాళ్లని ఈ చట్టాల పరిధిలోకి తీసుకురావడం కుదరదని స్పష్టం చేసింది. అంతకు ముందు ఇండస్ట్రియల్ కోర్ట్‌లో ఓ జర్నలిస్ట్ వేసిన పిటిషన్‌లూ చెల్లవని వెల్లడించింది. జస్టిస్ నితిన్ జందర్, జస్టిస్ సందీప్ మర్నేతో కూడిన ధర్మాసనం ఈ విషయం స్పష్టం చేసింది.

వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టు చట్టం కింద జర్నలిస్ట్‌లకు స్పెషల్ స్టేటస్ ఉందని, వాళ్ల సమస్యల్ని పరిష్కరించు కునే అవకాశమూ ఉందని బాంబే హైకోర్టు తెలిపింది. 2019లోనే ఇద్దరు జర్నలిస్ట్‌లు తమని కార్మిక శాఖ‌ పరిధిలోకి చేర్చకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రియల్ కోర్ట్‌లో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం...వ‌ర్కింగ్‌జ‌ర్న‌లిస్టుల చ‌ట్టం 1955 ని పరిశీలించింది. తమ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు జర్నలిస్ట్‌లకు ఇప్పటికే ఈ చట్టం సహకరిస్తోందని వివరించింది.

"సాధారణ ప్రజలకి, జర్నలిస్ట్‌లకి ఏ మాత్రం తేడా లేనప్పుడు జర్నలిస్ట్‌లు ప్రత్యేక చట్టం కింద స్పెషల్ స్టేటస్ పొందడంలో అర్థం లేదు. వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ కింద జర్నలిస్ట్‌లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వాళ్లు తమ వివాదాల్ని, సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే ఇండ‌స్ట్రియ‌ల్ చ‌ట్టాల‌ను వినియోగించుకోవచ్చు. కాబ‌ట్టి..జ‌ర్న‌లిస్టులు ఉద్యోగులు కాదు.. అలా చెప్పుకోకండి ప్ర‌జ‌లు న‌వ్వుతారు!`` అని బాంబే హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Tags:    

Similar News